Saturday, April 27, 2024
- Advertisement -

మహేష్ సినిమా అర్దాంతరంగా ఆగిపోయింది!

- Advertisement -

టాప్ దర్శకులు మణిరత్నం, సూపర్ స్టార్ మహేష్ కలిసి అప్పట్లో ఓ సినిమా చేద్దాం అని ప్రారంభం అయ్యే స్దాయి వరకు వచ్చింది. అయితే ఈ సినిమా అప్పట్లో ఎందుకు అలా ఆగిపోయిందో అర్దం కాలేదు. కానీ ఇప్పుడు ఆ స్క్రిప్టుకు స్కీన్ ప్లే రాసిన జయమోహన్ ఆ వివరాలు అందించారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం కొన్నేళ్లక్రితం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన “పొన్నియిన్ సెల్వన్” సినిమా అర్దాంతరంగా పురుట్లోనే ఆగిపోయింది.

ఈ చిత్రం కోసం మహేష్ బాబు, విజయ్, విశాల్ ,అనుష్క లను పెట్టి భారీగా నిర్మించాలి అని ప్లాన్ చేశారు. అయితే భారీ అంచనాలు తో మొదలైన ఈ భారీ చిత్రం ప్రీ- ప్రోడక్షన్ దశలోనే ఆగిపోయి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ చిత్రం ఆగిపోవడంపై కొన్ని పుకార్లు వచ్చాయి. అయితే అసలు నిజం బయిటకు వచ్చింది. ఈ సినిమా స్క్రీన్ ప్లే కోసం మణిరత్నంతో కలిసి పనిచేసిన రచయిత జయమోహన్ ఆ విషయం చెబుతున్నారు.

జయమోహన్ మాట్లాడుతూ.. ” ఈ సినిమాని భారీగా మొదలెట్టాలనే అనకున్నారు. స్క్రిప్టు కూడా అద్బుతంగా కుదిరింది. అయితే ఓ సమస్య వచ్చింది. తమిళనాడులో ఎన్నో దేవాలయాలు ఉన్నా కూడా ఏ ఒక్క దేవాలయంలోనూ ఈ సినిమా షూటింగ్ కు అనుమతి లభించలేదు.. దీంతో భారీస్థాయిలో దేవాలయాల సెట్టింగులు వేసి షూటింగ్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది.. అప్పటికీ అలా చేయాలని నిర్ణయానికీ వచ్చినా ఈ సెట్టింగ్ ల కోసమే రూ. 50 కోట్లు ఖర్చు అవుతుండటంతో.. అది ఆర్థికంగా సాధ్యం కాదని తేల్చి ప్రీ-ప్రోడక్షన్ దశలోనే సినిమా ఆపేశారు” అని చెప్పారు.

Related

  1. మహేష్ కొత్త సినిమా స్టోరీ లీక్ అయ్యింది!
  2. మహేష్ ని ఆకాశానికెత్తేసిన మురుగదాస్!
  3. మెగాస్టార్ ను ఆకాశానికెత్తేసిన మహేష్ బాబు!
  4. ఈ అలవాటు మహేష్ కు ఉంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -