మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్ వరసగా మూడు సూపర్ హిట్స్ అందుకొని హ్యాట్రిక్ కొట్టాడు టాప్ డైరెక్టర్ కొరటాల శివ. ప్రస్తుతం ఈ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయాలి అని టాప్ హీరోలు ఎదురుచూస్తున్నారు. అయితే కొరటాల శివ మాత్రం తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ తో తీయడానికి రెడీ అవుతున్నారు.
టాలీవుడ్ టాప్ ప్రొడ్యుసర్లలో ఒకరైన డీవీవీ దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి స్టోరీ లైన్ బయటకు వచ్చింది. ఆ ఆసక్తికరమైన స్టోరీ లైన్ ఏంటంటే.. మహేష్ బాబు ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడట.
శ్రీమంతుడు చిత్రంలో గ్రామాల దత్తత అనే సోషల్ ఎలిమెంట్ కాన్సెఫ్ట్ను మంచి కమర్షియల్ ఎలిమెంట్స్తో తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టిన కొరటాల…. ఇప్పుడు ఈ సినిమాలో కూడా మహేష్ను సీఎంగా చూపిస్తూనే…అటు సోషల్ ఎలిమెంట్స్తో పాటు ఇటు కమర్షియల్ ఫార్మాట్లోను ఉండేలా ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నాడట. దూకుడు చిత్రంలో ఎమ్మెల్యేగా అలరించిన మహేష్ ఇప్పుడు ఈ కొరటాల సినిమాలో ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని చక్రం తిప్పనున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ వచ్చే యేడాది మార్చి నుంచి ఆరంభమవుతుందట. ఆక్టోబర్ లో ఈ సినిమాని రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.
Related