అక్కినేని నాగచైతన్య, సమంత కు సంబంధించిన ఏ న్యూస్ అయిన చాలా హాట్ హాట్గా వైరల్ అవుతోంది. చైతు-సమంత లవ్ లో ఉన్నారు అని త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సంగతి ఇలా ఉంటే వీరిద్దరు కలిసి మరో సారి ఓ సినిమాలో నటించబోతున్నారు అనే వార్తలు వచ్చాయి. నాగర్జునతో ‘సోగ్గాడే చిని నాయనా’ లాంటి సినిమాని తీసిన దర్శకుడు కళ్యాణ కృష్ణ వీరిద్దరితో ఓ సినిమా తీయాలి అనుకున్నాడు.
ఈ సినిమాకి ‘కళ్యాణం’ టైటిల్ ని పరిశీలిస్తున్నారట. ఈ సినిమాను నాగ్ సొంతంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై నిర్మిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో ముందుగా సమంతను హీరోయిన్గా ఫైనలైజ్ చేశారు. అయితే వీరిద్దరు కలిసి నటిస్తే.. ఈ ఇద్దరి గురించి రోజూ ఏదో ఒక వార్త ప్రచారం అవుతుందని భావించిన నాగార్జున, నాగచైతన్య అలాంటి వార్తలకు తావివ్వకూడదని డిసైడ్ అయ్యారట. అందుకే ఓ నిర్ణయం తీసుకుని సమంతను తప్పించి ఆ ప్లేస్లో రకుల్ప్రీత్సింగ్ను హీరోయిన్గా తీసుకుంటారని వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు మరో న్యూస్ బయటకు వచ్చింది. ఈ చిత్రం నుంచి రకుల్ను కూడా తప్పించారట. ఇప్పుడు తమన్నాని ఈ చిత్రం కోసం తీసుకున్నారలి తెలుస్తోంది. చైతన్య, తమన్నా కలిసి ‘100% లవ్’, ‘తడాఖా’ చిత్రాలు చేశారు. ఈ రెండు హిట్ చిత్రాలే. ఈ నేపధ్యంలో తమన్నా వైపు మొగ్గుచూపారని తెలుస్తోంది. మూడోసారి కలసి నటించబోతున్న ఈ ఇద్దరూ హ్యాట్రిక్ హిట్ తమ ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.
Related