Friday, May 3, 2024
- Advertisement -

త‌మ‌న్నాతో చైతు క‌ళ్యాణం… స‌మంత‌తో కాదు

- Advertisement -

అక్కినేని నాగచైతన్య, సమంత కు సంబంధించిన ఏ న్యూస్ అయిన చాలా హాట్ హాట్‌గా వైర‌ల్ అవుతోంది. చైతు-స‌మంత లవ్ లో ఉన్నారు అని త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సంగతి ఇలా ఉంటే వీరిద్దరు కలిసి మరో సారి ఓ సినిమాలో నటించబోతున్నారు అనే వార్తలు వచ్చాయి. నాగర్జునతో ‘సోగ్గాడే చిని నాయనా’ లాంటి సినిమాని తీసిన దర్శకుడు కళ్యాణ కృష్ణ వీరిద్దరితో ఓ సినిమా తీయాలి అనుకున్నాడు.

ఈ సినిమాకి  ‘కళ్యాణం’ టైటిల్ ని పరిశీలిస్తున్నారట. ఈ సినిమాను నాగ్ సొంతంగా అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో ముందుగా స‌మంత‌ను హీరోయిన్‌గా ఫైన‌లైజ్ చేశారు. అయితే వీరిద్ద‌రు కలిసి నటిస్తే.. ఈ ఇద్దరి గురించి రోజూ ఏదో ఒక వార్త ప్రచారం అవుతుందని భావించిన నాగార్జున, నాగచైతన్య అలాంటి వార్తలకు తావివ్వకూడదని డిసైడ్ అయ్యారట. అందుకే ఓ నిర్ణయం తీసుకుని స‌మంత‌ను త‌ప్పించి ఆ ప్లేస్‌లో ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌ను హీరోయిన్‌గా తీసుకుంటార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

అయితే ఇప్పుడు మరో న్యూస్ బయటకు వచ్చింది. ఈ చిత్రం నుంచి ర‌కుల్‌ను కూడా త‌ప్పించార‌ట‌. ఇప్పుడు తమన్నాని ఈ చిత్రం కోసం తీసుకున్నారలి తెలుస్తోంది. చైతన్య, తమన్నా కలిసి ‘100% లవ్’, ‘తడాఖా’ చిత్రాలు చేశారు. ఈ రెండు హిట్ చిత్రాలే. ఈ నేపధ్యంలో తమన్నా వైపు మొగ్గుచూపారని తెలుస్తోంది. మూడోసారి కలసి నటించబోతున్న ఈ ఇద్దరూ హ్యాట్రిక్ హిట్ తమ ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.

Related

  1. నాకు చిన్నప్పటి నుంచే అలవాటు ఉంది – సమంత
  2. సమంత -చైతన్య ఎవరికి పార్టీ ఇచ్చారంటే?
  3. సమంతకు గట్టి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున
  4. సమంత ఎంగేజ్మెంట్ సీక్రెట్ గా అయ్యిందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -