Thursday, April 25, 2024
- Advertisement -

అవ‌సరాల ద‌ర్శ‌క‌త్వంలో నాగ్, మంచుల‌క్ష్మి వెబ్‌సిరీస్‌

- Advertisement -

వెబ్‌సిరీస్‌ల‌పై ఇప్పుడు తెలుగు సినీ ప్ర‌ముఖులు క‌న్నేశారు. యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు మంచి హ‌వా కొన‌సాగిస్తుండ‌డంతో అంద‌రి దృష్టి వాటిపై ప‌డింది. సినిమాల క‌న్నా వెబ్ సిరీస్ చాన్నాళ్లు ప్ర‌జ‌ల దృష్టిలో ఉంటుండ‌డంతో న‌టీన‌టులు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో వెబ్ సిరీస్ లు ఏ విధంగా హల్ చల్ చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి అలా ఈ కల్చర్ షిఫ్ట్ అయ్యిందో లేదో ద‌క్షిణ భార‌తానికి కూడా పాకేసింది. రానా, న‌వ‌దీప్‌, తేజ‌స్విని ఇప్పుడు వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్ న‌టిస్తున్నారు.

ఇప్పుడు ఈ బాట‌లో అక్కినేని నాగార్జున న‌టించున్నార‌ట‌. అది మంచుల‌క్ష్మితో క‌లిసి న‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది. నాగార్జున వెబ్ సిరీస్‌తో సరికొత్తగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. మంచులక్ష్మి దీని కోసం ప్రయత్నాలు చేస్తోంద‌ని సమాచారం. ఈ వెబ్ సిరీస్‌ను న‌టుడు, ద‌ర్శ‌కుడు అవసరాల శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం చేయనున్నాడట. ప్రయోగాలను చేయడంలో ఎప్పుడు ముందు ఉండే నాగార్జున ఈ స‌రికొత్త దానికి అంగీకారం తెలిపాడు. ఆల్మోస్ట్ నాగార్జున అంగీక‌రించాడ‌ని, ఒక‌వేళ ఆయ‌న‌ ఒప్పుకోకుంటే సుమంత్‌తో వెబ్ సిరీస్ పూర్తి చేస్తారని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -