Tuesday, April 30, 2024
- Advertisement -

ఓటర్ రాక, ఎవరికీ ఎరుక?

- Advertisement -

గత చాలా కాలం గా మంచు విష్ణు తన సినిమా ఓటరు ని ప్రేక్షకుల ముందుకు తేవాలి అని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఎన్నికల ముందే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అయితే కొద్ది రోజుల తరువాత సినిమా డైరెక్టర్ కార్తిక్ రెడ్డి మంచు విష్ణు తనని బెదిరిస్తున్నారు అని ఈ సినిమా విడుదల అవ్వకుండా ఆపుతున్నడు అని ఆరోపణలు చేసిన విషయం వాస్తవం. దీని పై ఇరు వర్గాలు కోర్ట్ దాకా వెళ్ళినప్పటికి ఏం జరిగింది అనేది ఇంకా క్లారిటీ లేదు.

తాజా గా ఈ సినిమా జూన్ 21వ తారీఖున విడుదల అవుతుంది అని, తెలుగు, తమిళ భాషల్లో ఓకే రోజున ఈ సినిమా ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము అని నిర్మాతలు తెలిపారు. అయితే ఈ సినిమా దర్శకుడు కార్తిక్ రెడ్డి మాత్రం, ఇంకా ఈ సినిమా విడుదల అవుతుంది అన్న నమ్మకం తో లేడు అని తెలుస్తుంది.

ఇప్పటికే పలు మార్లు విడుదల అవ్వాల్సిన సినిమా మంచు విష్ణు వల్ల వాయిదా పడింది అని ఈ సారి అయినా సినిమా విడుదల అవుతుందో లేదో తెలియదు అనే అభిప్రాయాన్ని వ్యక్త పరచినట్లు సమాచారం. సురభి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఒక పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ నెల 21 న మన ముందుకు రానున్నది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -