టాలీవుడ్ డైరెక్టర్ మారుతి చిన్న సినిమాలను తనదైన స్టైల్ లో అటు యూత్ కి ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చినట్లు తెరకెక్కించడంలో మంచి దిట్ట. గతంలో ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో హిట్ అందుకున్న మారుతి ఇప్పటివరకు తన తరువాతి సినిమాను మొదలుపెట్టలేదు. ఇక యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, జీఏ2 సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను ఇంకా మొదలుపెట్టనప్పటికీ విడుదల తేదిని మాత్రం ప్రకటించేశారు. అక్టోబర్ 1న విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
మారుతి అనుకున్నట్లు మార్చిలో సినిమాను మొదలుపెడితే.. అక్టోబర్ నాటికి రిలీజ్ చేయడం కష్టమేమీ కాదు. సినిమాలను తొందరగా పూర్తి చేయడం మారుతి స్పెషాలిటీ. కానీ ఇక్కడొక సమస్య ఎదురవుతోంది.ఇప్పటివరకు ఈ సినిమాకి హీరోయిన్ దొరకలేదు. ముందుగా సాయిపల్లవిని తీసుకోవాలనుకున్నారు.
దానికి ఆమె భారీ పారితోషికం డిమాండ్ చేసిందట. దీంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు ఆమె అడిగినంత ఇచ్చి తీసుకుందామనుకున్నా.. కాల్షీట్స్ ఖాళీగా లేవు. దీంతో సాయి పల్లవి రేంజ్ ఉన్న హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లంతా కూడా బిజీగా ఉన్నారు. ఎవరి డేట్స్ ఖాళీగా లేవు. మారుతి రాసుకున్న కథ ప్రకారం.. ఈ సినిమాకి స్టార్ హీరోయినే కావాలని ఆయన పట్టుబట్టి కూర్చుకున్నారు.
ఇప్పుడు షూటింగ్ మొదలయ్యేలోపు హీరోయిన్ ని ఫిక్స్ చేసుకోవాలి. కొత్త హీరోయిన్లయితే చాలా మంది దొరుకుతారు కానీ స్టార్ హీరోయిన్లంటే ప్రస్తుతం కొరత ఏర్పడింది. హీరోయిన్ ఫిక్స్ అయితే గానీ.. మారుతి సినిమా విషయంలో క్లారిటీ రాదు. ఈ సమస్యను అధిగమించి చెప్పిన సమయానికి సినిమాని విడుదల చేస్తాడో లేదో చూడాలి…!
ఈ సర్పంచ్ ను ఆదర్శంగా తీసుకోవాల్సిందే!