తెలుగు ఇండస్ట్రీలో కళాతపస్వి కే.విశ్వనాథ్ 1992లో తెరకెక్కించిన చిత్రం ‘ఆపద్భాంధవుడు’. ఈ చిత్రంలో చిరంజీవి, మీనాక్షి శేషాద్రి నటించారు. ఈ సినిమా ఎంత హిట్టైందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ద్వారా మీనాక్షికి కూడా మంచి పేరు వచ్చింది. మీనాక్షి బాలీవుడ్లోను అనేక ఆఫర్స్ అందుకొని స్టార్ హీరోయిన్గా కొన్నాళ్లు తన హవా నడిపించింది. హిందీలో దాదాపు 30కి పైగా సినిమాలలో నటించడంతో ఆమె క్రేజ్ పీక్స్కి చేరింది. 18 ఏళ్ల వయసులో మిస్ ఇండియా టైటిల్ సొంతం చేసుకొని పలు సినిమా అవకాశాలు దక్కించుకుంది.
ఆపద్బాంధవుడు ముందు మీనాక్షిఅంతకుముందే తెలుగులో ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’అనే సినిమా చేసినా ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి సరసన ఆపద్భాంధవుడు చిత్రం తర్వాత మీనాక్షికి చాలా పాపులారిటీ సంపాదించింది. చూడచక్కని రూపం, అమాయకపు హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. 1995లో హరీష్ మైసూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయిపోయింది. ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితాన్ని గడిపేస్తుంది. తాజాగా ఆమెకు సంబంధించి లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ప్రస్తుతం 57 ఏళ్ల మీనాక్షి ముఖంలో కళ తప్పిపోయి వయసు మళ్లిన ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పూర్తిగా కళ తప్పిపోయి వయస్సు ముదిరినట్టుగా కనిపిస్తుంది. అభిమానులు ఆమెని చూసి నోరెళ్లపెడుతున్నారు. ఏదేమైన హీరోయిన్స్ గ్లామర్ ప్రపంచంలో ఉన్నంత వరకే బాగుంటారు, ఒక్కసారి బయటకు వచ్చారో వారిని గుర్తు పట్టడం చాలా కష్టం అన్నట్టుగా మారిపోతుంటారు.