అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్నైట్ స్టార్ హీరోగా మారాడు విజయ్ దేవరకొండ.ఈ సినిమాతో విజయ్కు విపరీతమైన క్రేజ్ వచ్చింది.యూత్లో విజయ్ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీతా గోవిందం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 15న విడుదలకు సిద్ధం అవుతుంది.ఈ సినిమాపై బయట పాజిటివ్ బజ్ ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.ఇప్పటికే విడుదలైన టీజర్,ట్రైలర్,సాంగ్స్కు సూపర్ రెస్పన్స్ వచ్చింది.ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికి …ఈ నెల 12న ప్రీ రిలీజ్ ఈవెంట్ను వైజాగ్లో నిర్వహించే యోచనలో టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈవెంట్కు గెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నట్లు సమాచారం.ఎంత గీతా ఆర్ట్స్లో బ్యానర్లో సినిమా చేస్తే మెగా ఫ్యామిలీ సపోర్టు తీసుకుంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఆడియో వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. మళ్లీ ఇప్పడు చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నారని వార్తలు రావడం కొందరు అంసతృప్తితో ఉన్నారని తెలుస్తుంది.ఇదేమి మెగా ఫ్యామిలీ సినిమా కాదని,విజయ్ దేవరకొండకు మంచి ఫాలోయింగ్ ఉందని,దీనిని వారు క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారని కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.విజయ్-రష్మిక మందన్న జంటగా రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా డైరెక్టర్ పరుశురాం గీత గోవిందాన్ని తెరకెక్కించాడు.ఈ సినిమాకు తనకు మరో హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు విజయ్ దేవరకొండ.