Saturday, May 18, 2024
- Advertisement -

మ‌హేష్ బాబు సినిమా చూసిన కేటీఆర్

- Advertisement -

మ‌హేష్ బాబు తాజా చిత్రం భ‌ర‌త్ అను నేను సినిమా విడుద‌ల రోజు నుండే సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.ఈ సినిమాపై సీని ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు జ‌ల్లులు కురిపిస్తున్నారు.ద‌ర్శ‌కుడు రాజమౌళి, ఎన్టీఆర్‌,రాంచ‌ర‌ణ్ ఇలా చాలామంది సినిమా అభినందిస్తున్నారు. ఇప్పుడు ఈ జాబాతాలో పొలిటిషియ‌న్ కూడా చేరారు. తెలంగాణ ఐటి మినిష్ట‌ర్ కేటీఆర్ సినిమాను చూసి భ‌ర‌త్ టీంను ప్ర‌త్యేకంగా పిలిచి మ‌రి అభినందిచారు.

ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ సినిమా చాలా బాగా తీసార‌ని ,మ‌హేష్ బాబు మ‌రోసారి త‌న న‌ట‌న‌తో ప్రువ్ చేసుకున్నార‌ని మంత్రి కేటీఆర్ ప్ర‌శంసించారు.తెలంగాణ మంత్రి కేటీఆర్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు ధన్యవాదాలు తెలిపారు. మీ విలువైన సమయాన్ని కేటాయించి, ‘భరత్ అనే నేను’ సినిమాను చూసినందుకు, తమ ప్రయత్నాలను ప్రశంసించినందుకు మీకు ధన్యవాదాలు అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.

https://www.youtube.com/watch?v=k9a9fSRhDoc

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -