యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రభాస్.. ప్రస్తుతం రెండు సినిమా షూటింగ్ లలో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇదిలా ఉండగా.. బాలీవుడ్లో మరో సంచలనానికి తెరదీయబోతున్నాడని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్.. ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ సినిమాతో పాటు కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సలార్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాలు షూటింగ్ జరుపుకుంటుండగానే రెబల్ స్టార్ మరో భారీ యాక్షన్ పాన్ ఇండియా సినిమా చేయడానికి ఒకే చెప్పడని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మల్టీ స్టారర్గా సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ప్రభాస్ నటించనున్నారట.
ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నదని టాక్. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపించబోతుండటం పట్ల ఆయా హీరోల అభిమానులు తెగ సంబరపడి పోతున్నారు. ప్రభాస్ ప్రస్తుత సినీమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నాడట. ఇక ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా జులై 30న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
బిగ్ బాస్-5లో స్టార్ సింగర్ హేమచంద్ర !
ఈ అమ్మడు కూడా పవన్ కు నో చెప్పిందా?