Wednesday, May 15, 2024
- Advertisement -

తొలిసారిగా భార్య‌భ‌ర్త‌లు క‌లిసి ఓ సినిమా…!

- Advertisement -

తొలి సినిమాతోనే న‌టించిన ఇద్ద‌రు ఆ త‌ర్వాత త‌మ బంధాన్ని కొన‌సాగించారు. మొద‌ట మిత్రులుగా ఉన్న‌వారిద్ద‌రూ త‌ర్వాత ప్రేమ చిగురించి పెళ్లి దాకా ఏర్ప‌డిన జంట తెలుగులో ఉన్నది అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత‌దే అని చెప్ప‌వ‌చ్చు. ‘ఏమాయ చేశావే’తో ప్రారంభ‌మైన వారి బంధం ‘ఆటో నగర్ సూర్య’తో బ‌లోపేతమై ఆ త‌ర్వాత మూడుముళ్ల బంధంగా ఏర్ప‌డింది.

వీరిద్ద‌రూ ఆ త‌ర్వాత వేర్వేరు సినిమాలు చేస్తున్నా తొలిసారిగా ఇద్ద‌రు భార్య‌భ‌ర్త‌లు క‌లిసి ఓ సినిమా చేస్తున్నారు. మళ్లీ వీరిద్దరు కలిసి సినిమా చేయ‌నున్నారు. నిన్నుకోరి ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో డీవీవీ దాన‌య్య నిర్మాణంలో ఓ సినిమా రూపొందుతోంది. ఆ సినిమాలో చైతూ, స‌మంత న‌టించ‌డానికి అడిగార‌ట‌. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు విరామం లేకుండా వ‌రుస సినిమాలు చేస్తున్నారు.

ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య శైల‌జారెడ్డి అల్లుడు, ఆ త‌ర్వాత మ‌రో సినిమా చేస్తుండ‌గా స‌మంత రంగ‌స్థ‌లం, త‌మిళంలో ఓ సినిమా చేస్తోంది. వీరిద్ద‌రి ప్ర‌స్తుతం చేస్తున్న సినిమాలు అయిపోయిన త‌ర్వాత ఈ సినిమా మొద‌లవుతుంద‌ని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -