బుల్లి తెరపై వచ్చే కొన్ని ప్రోగ్రాంలో దారుణంగా బూతులు పేలుతున్నాయి. ముఖ్యంగా జబర్దస్త్ షోలో బూతులు మరింతగా ఎక్కువ అవుతున్నాయి. బూతులతో కామెడీ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉన్నారు. జబర్దస్త్ కు పోటీ అంటూ వచ్చిన దేశముదుర్లు షో లో యాంకర్ గా శ్రీముఖి చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.
అదే కార్యక్రమంలో ధన్రాజ్ కూడా పాల్గొంటూ ఉన్నాడు. తాజాగా ఒక స్కిట్ సందర్బంగా బూతు సంభాషణ జరిగింది. ఆ బూతు సంభాషణ ఎంత దారుణంగా ఉందంటే తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ప్రోగ్రాంలో భాగంగా శ్రీముఖిని నీవు ఎవరికైనా ముద్దు పెట్టావా అంటూ అడిగాడు. అప్పుడు శ్రీముఖి రవికి ముద్దు పెట్టాను అంటూ చెప్పుకొచ్చింది. అప్పుడు ధన్రాజ్ ముద్దు పెట్టినప్పుడు నీకు ఎలా అనిపించింది, రవి నీకు పెట్టినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు అంటూ ప్రశ్నించాడు.
అందుకు శ్రీముఖి సిగ్గు పడటం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఇంత దారుణంగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పడంతో వీరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ఈ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ముందు ముందు ఎక్కడి వరకు వెళ్తాయో అంటూ తెలుగు ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో అందరు కలిసి చూడలేకుండా జబర్దస్త్, దేశముదుర్లు కార్యక్రమాలు ఉన్నాయి అంటూ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటూ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మంచిదని అంటున్నారు.
{youtube}9-alRdghHAM{/youtube}
{youtube}v=6lxGxqY_Xlg{/youtube}
Related