Friday, March 29, 2024
- Advertisement -

రాజేంద్ర ప్రసాద్ కి సమంత కి చెడిందా?

- Advertisement -

మిస్ గ్రానీ అనే కొరియన్ చిత్రానికి రీమేక్ గా త్వరలో తెలుగు లో ఓ బేబీ అనే చిత్రం రాబోతుంది. సమంత ఈ సినిమా లో ప్రధాన పాత్ర పోషించగా,ఈ సినిమా ని నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా జులై 4 న విడుదల కానున్న నేపథ్యం లో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో జోరు ని .పెంచారు. ఈ సినిమా కి సంబందించిన అనేక విశేషాలని ఈ మధ్య నందిని రెడ్డి మీడియా తో పంచుకున్నారు. అదే సందర్భం లో, సినిమా షూటింగ్ సందర్భం గా రాజేంద్ర ప్రసాద్ తాగి రావడం, దానికి సమంత, నందిని రెడ్డి కోప్పడ్డారు అనే రూమర్స్ పైన క్లారిటీ ఇచ్చారు.

“అసలు నిజానికి ఈ వార్తలు ఎవరు సృష్టించారో తెలియదు. అసలు అలాంటిదేమి మా షూటింగ్ అప్పుడు జరగలేదు. అవన్నీ తప్పుడు వార్తలు. అందులో అసలు నిజమే లేదు.” అని నందిని రెడ్డి చెప్పారు.

నిజానికి అప్పుడు వచ్చిన పుకార్లలో రాజేంద్ర ప్రసాద్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని, ఆయన సమంత ఎలా నటించాలో చెప్తున్నారని, ఇంకా చాలా వార్తలు వచ్చాయి కానీ అందులో అసలు నిజమే లేదని ఇప్పుడు తెలిసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -