- Advertisement -
నాని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’ అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని రేపు(12-04-2018)విడుదలకు సిద్ధం అవుతుంది. అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ కథానాయికల పాత్రలు పోషించారు. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేశారు.ఈ చిత్రం అమెరికాలో రికార్డు స్థాయిలో అత్యధిక స్క్రీన్లపై విడుదల కాబోతోన్నట్లు సమాచారం. నాని సినీ కెరీర్లో ఇప్పటి వరకు లేని విధంగా మొత్తం 600 స్క్రీన్లపై అక్కడ సినిమాను ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది.
నాని సినిమాలకు అమెరికాలో మంచి డిమాండ్ ఉంటుంది.ఇప్పటికే నాని వరుస విజయాలతో రాణిస్తున్నారు. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు డైరక్టర్.ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.