ఓ ఆసక్తికర మల్టీస్టారర్ సినిమా టాలీవుడ్లో ప్రారంభమైంది. యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ సినిమా రూపుదిద్దుకుంటోంది. భారీ కమర్షియల్ హిట్ తీసేందుకు మల్టీస్టారర్ సినిమా తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్నారు.
శ్రీరామ్ ఆదిత్య గతంలో ‘భలే మంచిరోజు’, ‘శమంతక మణి’ సినిమాలు విభిన్నంగా తెరకెక్కించారు. దర్శకుడిని నమ్మి నాగ్, నాని సినిమాకు ఓకె చెప్పారు. అయితే ఈ సినిమా అధికారికంగా శనివారం (ఫిబ్రవరి 24) నాని జన్మదినం సందర్భంగా మొదలైంది. హైదరాబాద్లోని నాని నివాసంలో ఈ సినిమా బృందం కలుసుకుంది. ఈ సందర్భంగా నానికి శుభాకాంక్షలు చెప్పేసి ఒక సెల్ఫీ తీసుకొని సినిమాను ప్రారంభించినట్టు చేసేశారు. మంచి కథలు ఉంటే నాని, నాగార్జు ఎప్పుడెప్పుడా అని సినిమా చేయడానికి ఆసక్తి ప్రదర్శిస్తారు. అందుకే శ్రీరామ్ ఆదిత్య కథ నచ్చి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అయితే సినిమా ప్రారంభోత్సవా నాగార్జున మినహా మిగతా అందరూ వచ్చారు. అందరూ కలిసి ఓ సెల్ఫీ తీసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం నాగార్జున ఆర్జీవీ దర్శకత్వంలో శపథం సినిమా చేస్తున్నారు. ముంబైలో జరుగుతున్న షూటింగ్లో పాల్గొంటుండడంతో నాగ్ రాలేకపోయారు. అతి త్వరగా ఈ క్రేజీ ప్రాజెక్టుకు సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమాలో నాగార్జున డాన్గా, నాని వైద్యుడిగా కనిపించనున్నారు. ఈ సినిమాలో ఒక హీరోయిన్గా శ్రద్ధా శ్రీనాథ్ ఎంపికయ్యింది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించనున్నారు.