హీరోయిన్ నయనతారకి తమిళనాడులో హీరోలతోపాటు సమానంగా క్రేజ్ ఉంది.నయనతార కోసం సినిమాకు వెళ్లేవాళ్ల సంఖ్య బాగా పెరిగిపోతుంది.అందుకే ఆమె పారితోషకం కూడా బాగానే డిమాండ్ చేస్తుంది. నయనతార నటన కన్నా తన లవ్ స్టోరీలతో బాగా ఫేమస్ అయింది.ఇప్పటికే రెండు లవ్ స్టొరీలకు బ్రేకప్ చెప్పిన నయన ఇప్పుడు మూచ్చటగా మూడోసారి ప్రేమలో ఉంది. మొదట హీరో శింబును ప్రేమించింది,తరువాత వీరి మధ్య గొడవలు వచ్చి విడిపోయారు. తరువాత కొన్నాళ్లుకు ఇండియన్ మైఖల్ జాక్సన్ ప్రభుదేవాని ప్రేమించింది. అప్పటికే ప్రభుదేవా పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నయనతార కోసం భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు ప్రభుదేవా.పిల్లలు పెంచుకునే విషయంలో నయనతారకు ప్రభుదేవాకు మధ్య విభేదాలు వచ్చి, వీరిద్దరు కూడా దూరంగా ఉండిపోయారు.
రెండు ప్రేమల వైఫల్యలతో ఇంకా జీవితంలో ఎవరిని ప్రేమించనని చెప్పి మరి మరో వ్యక్తిని ప్రేమించింది నయనతార. ఆ వ్యక్తి ఎవరో కాదు యంగ్ డైరక్టర్ విఘ్నేశ్ శివన్. ప్రస్తుతం వీరిద్దరు ప్రేమలో మునికి తెలుతున్నారు.వీలు చిక్కినప్పుడల్లా ఇద్దరు కలిసి షికార్లుకు వెళ్లుతున్నారు. ఇప్పుడు విఘ్నేశ్ శివన్ ఓ స్టోరీని రెడీ చేశాడని అందులో హీరోయిన్గా నయనతారని తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.అయితే దీనికి నయన ఓ కండిషన్ పెట్టినట్లు సమాచారం.ఆ కథలో విఘ్నేశ్ శివన్ హీరో అయితేనే చేస్తాను అని కండిషన్ పెడుతోందట.మరి విఘ్నేశ్ శివన్ హీరో అయితే ఎవరు చూస్తారు అనుకుంటే పొరపాటే, ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార చేస్తుందని మరిచిపోవద్దు.తమిళనాడులో నయనతారకి గల క్రేజ్ తెలిసిందే.ఆ విధాంగా నయనతార తన బాయ్ప్రెండ్ని హీరోగా చేయలని భావిస్తుంది.