Saturday, April 27, 2024
- Advertisement -

ఎట్టకేలకు సారీ చెప్పిన నయన్‌..ఎందుకో తెలుసా?

- Advertisement -

ఇటీవలి కాలంలో వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది బ్యూటీ నయనతార. రీసెంట్‌గా అన్నపూర్ణి సినిమాతో మిక్స్‌ డ్ టాక్‌ని సొంతం చేసుకోగా ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గరి నుండి తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో హిందులను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయంటూ హిందూ సంఘాలు నిరసన చేపట్టాయి. ఈ సినిమా విషయంలో మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలో నయన్‌పై కేసులు కూడా నమోదయ్యాయి.

ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ని తీసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ నయన్‌ సినిమాను స్ట్రీమింగ్‌ నుంచి తొలగించింది. దీంతో రంగంలోని దిగింది నయన్. ప్రేక్షకులకు క్లారిటీ ఇస్తూ ఓ లెటర్ రిలీజ్ చేశారు. ఎవరి భావోద్వేగాలను దెబ్బతీసే ఉద్దేశ్యం తనకు మరియు తన టీమ్ కి లేదని వెల్లడించింది. అన్నపూర్ణి ఆందోళనలను ఉద్దేశించి క్షమాపణ తెలిపింది.

జై శ్రీరామ్ , ఓం అని రాసి క్షమాపణలు చెప్పింది. భగవంతుడిని పూర్తిగా నమ్మే వ్యక్తిగా మరియు దేశంలోని దేవాలయాలను తరచుగా సందర్శిస్తున్న నేను మరోసారి ఇలాంటి పొరపాటు జరగనివ్వను అని తెలిపింది నయన్. ఈ సినిమా ద్వారా మనస్సులు గాయపడ్డ వారంతా క్షమించాలని కోరారు. మరి ఇప్పటికైనా అన్నపూర్ణి వివాదానికి పుల్ స్టాప్ పడుతుందో లేదో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -