Tuesday, April 30, 2024
- Advertisement -

కార్తీకదీపం దర్శకుడితో వంటలక్క.. డైరెక్టర్ పై విరుచుకుపడ్డ నెటిజన్లు?

- Advertisement -

ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ లో టాప్ రేటింగ్స్ ను సొంతం చేసుకొని దూసుకుపోతున్న సీరియల్ “కార్తీకదీపం”.ఈ సీరియల్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సీరియల్ కి ఎంతో మంది అభిమానులున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఈ సీరియల్ ఏకంగా 1057 ఎపిసోడ్ లో ప్రసారం అవుతూ ఎన్నో ట్విస్టులతో దూసుకుపోతుంది. ఇన్ని రోజులు డాక్టర్ బాబు.. దీప ఎప్పుడు కలుస్తారా అంటూ ఎదురుచూసిన ప్రేక్షకులకు దర్శకుడు మరింత ట్విస్ట్ ఇచ్చారు.

గత కొన్ని ఎపిసోడ్లు వరకు వంటలక్క డాక్టర్ బాబుల మధ్య సన్నివేశాలు సాగదీస్తూ ప్రేక్షకులకు పిచ్చెక్కించారు. ఈ క్రమంలోనే అభిమానులు ఈ సీరియల్ డైరెక్టర్ ఎవర్రా బాబు ఇలా సావా కొడుతున్నాడు అంటూ డైరెక్టర్ పై మండిపడ్డారు. అయితే ఇప్పటి వరకు కార్తీకదీపం సీరియల్ డైరెక్టర్ ని చాలామంది చూసి ఉండకపోవచ్చు.

Also read:ఆ అస్లీల వీడియోలో ఉన్నది నేను కాదు అంటూ ఏడ్చేసిన హీరోయిన్!

తాజాగా వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ కార్తీకదీపం సీరియల్ డైరెక్టర్ కాపుగంటి రాజేంద్రతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసింది. అది చూసిన బుల్లితెర ప్రేక్షకులు, నెటిజన్లు తమదైన శైలిలో డైరెక్టర్‌పై విరుచుకుపడ్డారు. ఈ సీరియల్ తెరకెక్కించిన మహానుభావుడవి నువ్వే నాసామి… సీరియల్ లో ఏం ట్విస్టులు పెట్టారు సార్… ఇంతవరకు డాక్టర్ బాబు వంటలక్కను నమ్మలేదు.. ఇప్పుడు వంటలక్క డాక్టర్ బాబును నమ్మదు ఇదే కదా సీరియల్ కథ? అంటూ నెటిజన్లు తమదైన శైలిలో దర్శకుడు పై సెటైర్లు వేస్తున్నారు.

Also read:రాజమౌళి షార్ట్ ఫిలిం.. ఆర్ఆర్ఆర్ కంటే ముందే విడుదల!

కాపుగంటి రాజేంద్ర గతంలో రవిరాజా పినిశెట్టి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన.. మోహన్ బాబు ‘శివ్ శంకర్’, అల్లరి నరేష్ ‘రాంబాబు గాడి పెళ్లాం’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో తర్వాత కార్తీకదీపం సీరియల్ కి దర్శకత్వం వహించి మంచి గుర్తింపును దక్కించుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -