Tuesday, May 14, 2024
- Advertisement -

ప్రేమను పంచుతానంటున్న నిధి అగర్వాల్..?

- Advertisement -

దేశంలో కరోనా పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్న నేపథ్యంలో ఎంతోమంది నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలోనే రోజుకో లక్షల సంఖ్యలో కేసులు నమోదు కాగా వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఆసుపత్రులలో సరైన సమయంలో ఆక్సిజన్, మందులు వంటి సౌకర్యాలు లభించకపోవడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది సెలబ్రెటీలు ముందుకు వచ్చి తమ వంతు సాయంగా కరోనా బాధితులకు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి వారిని లిస్టులో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ చేరింది.

ఇప్పటికే కరోనా బాధితుల కోసం సోనుసూద్, మెగాస్టార్ చిరంజీవి వంటి వారు పలు సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి సహాయం చేస్తుండగా తాజాగా నిధి అగర్వాల్ కూడా డిస్ట్రిబ్యూట్ లవ్ అనే నిధి సేకరణ సంస్థను ఆమె ప్రారంభించనున్నారట. కోవిడ్ సంబంధిత అన్ని సహాయాలను అందించేలా ఈ సంస్థ నడుస్తుందని తెలిపింది. అత్యవసర పరిస్థితులలో సాయం కోసం ఎవరైనా ఈ వెబ్ సైట్ కి రిక్వెస్ట్ పెట్టవచ్చు. ఈ విధంగా రిక్వెస్ట్ పెట్టగానే తమ టీమ్ వారికి సహాయ చర్యలు చేపడుతుందని నిధి అగర్వాల్ తెలియజేశారు. ఈ ఫౌండేషన్ ద్వారా కరోనా బాధితులకు కావలసిన మందులు ఆహార పదార్ధాలు వంటి వాటిని అందిస్తామని తెలిపారు.

Also read:ఆ ఫొటో చిరునవ్వులు తెప్పించింది: నమ్రత

ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరహర వీరమల్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. అదేవిధంగా మహేష్ బాబు బావ అశోక్ గ‌ల్లా హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న సినిమాలో ఈమె హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Also read:ఆర్ఆర్ఆర్ చూస్తే ఆడియన్స్ కన్నీళ్లు పెట్టింటారు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -