హీరోయిన్ నిధి అగర్వాల్ తెలుగులో వరుస సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉంది. ఆమె తెలుగులో తొలిసారి నాగచైతన్య సినిమాలో నటించింది. నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచియం అయింది నిధి అగర్వాల్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయింది.అయనప్పటికి ఆమెకు వరుస ఆఫర్లు రావడం విశేషం. నిధి అగర్వాల్ ప్రస్తుంత అఖిల్ హీరోగా నటిస్తున్న మిస్టర్ మజ్ను సినిమాలో నటిస్తుంది.
తాజాగా ఆమెకు మరో ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం నందినీ రెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన కాశీ అనే నూతన దర్శకుడితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా నిధి అగర్వాల్ను తీసుకున్నారట. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తన నిర్మాణ సంస్థలో నిర్మించనున్నారు.