లాస్ట్ ఇయర్ అల్లు, మెగా ఫ్యామిలీ హోలీ సెలబ్రేషన్ చాలా ఘనంగా జరిగాయి. ఆ సెలబ్రేషన్స్ లో అల్లు అర్హ, నిహారిక సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అని చెప్పాలి. కానీ ఈ ఇయర్ హోలీకి మాత్రం అల్లు, మెగా ఫ్యామిలీ సభ్యులు అందరూ తమతమ వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
నిహారిక కొణిదెల తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం చెన్నైలో ఉంది. చెన్నైలోని హోలీని సెలబ్రేట్ చేసుకుంది నిహారిక. సూర్యకాంతం మూవీ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మ్యాడ్ హౌస్ అనే వెబ్ సీరీస్ ని స్టార్ట్ చేసిన నిహారిక ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టు పై దృష్టి పెట్టింది. ఈ ప్రాజెక్ట్ ను చెన్నైకి చెందిన స్వాతి డైరెక్ట్ చేయబోతోంది. ఫీచర్ ఫిల్మా లేక వెబ్ సీరిసా అనే డీటెయిల్స్ మాత్రం ఇంకా బయటకు రాలేదు.
ఆ ప్రాజెక్టు పని మీదే చెన్నైకి వెళ్లిన నిహారిక నా కొత్త ఫ్యామిలీతో హోలీ సెలబ్రేషన్ అంటూ కొన్ని బ్యూటిఫుల్ ఫోటో షేర్ చేసుకుంది. ఆ పిక్స్ చూసినవారంతా ఈ ఇయర్ మీ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ మిస్ అవుతున్నాం అంటూ కామెంట్స్ పెడుతూ నిహారికా కి హోలీ విషెస్ ని తెలియజేస్తున్నారు. నిహారిక షేర్ చేసిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.