పవన్ కల్యాణ్ సినిమా ‘పులి’తో టాలీవుడ్కు పరిచయం అయిన నికీషా ఆ సినిమా ఫ్లాప్ కావడంతో నిరాశ పడింది. ఈ సినిమా తరువాత ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూ సాగుతోంది. ఉన్నట్లుండి తన వాఖ్యలతో వార్తల్లో నిలిచింది.ప్రభుదేవాతో తమ కుటుంబానికి సత్సంబంధాలున్నాయని నికీషా చెప్పింది. మీకు ఇష్టమైన హీరో ఎవరు అని తనను అడిగితే తను ప్రభుదేవా పేరునే చెబుతానని ఈమె అంటోంది.
నటుడిగా ప్రభుదేవా అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన డైరెక్షన్లో నటిస్తారా? అని అడిగితే, ప్రభు దర్శకత్వంలో నటించడమే కాదు , అవకాశం వస్తే ఆయనను పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అని చెప్పి అందరిని ఆశ్చర్యపరించింది నికీషా.ప్రభుదేవాకు ఇప్పటికే పెళ్లి అయి విడాకులు కూడా తీసుకున్నాడు. ఈ మధ్యలో హీరోయిన్ నయనతారతో ప్రేమ,బ్రేకప్ అన్ని చకా చకా జరిగిపోయ్యాయి.మరి నికీషా వాఖ్యలపై ప్రభుదేవా ఎలా స్పందిస్తారో!