- Advertisement -
సందీప్కిషన్ హీరోగా ‘ఒక్క అమ్మాయి తప్ప’ చిత్రం రాబోతుంది. ఈ చిత్రంలో విలక్షణమైన నటి నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ నవంబర్ 18 నుండి ప్రారంభం అవుతుంది.
రాజసింహ తాడినాడ ఈ చిత్రంతో డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు.ఈ చిత్రానికి మిక్కి జె.మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో సందీప్ తెలివైన కాలేజ్ కుర్రాడి పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్గా నిలుస్తుంది అని సందీప్ తెలిపారు.
ఇంకా ఈ చిత్రంలో బ్రహ్మానందం, రవికిషన్, అలీ, తనికెళ్ళభరణి, రావు రమేష్, పృథ్వీ, సప్తగిరి తదితరులు నటులు నటిస్తున్నారు. బోగాధి అంజిరెడ్డి ఈ చిత్రాని నిర్మిస్తున్నారు.