మహేష్ బాబు తాజా చిత్రం ‘భరత్ అనే నేను’ షుటింగ్ పూర్తి చేసుకుని ప్రీ రిలీజ్ ఈవెంట్కు రెడీ అవుతుంది.ఈవెంట్ సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు రాంచరణ్, ఎన్టీఆర్ ముఖ్యఅతిధలుగా రాబోతున్నారనే వార్త ఇప్పుడు సంచలనగా మారింది.ఎందుకంటే చిన్న హీరోలు తమ సినిమా రిలీజ్ అప్పుడు పెద్ద హీరోలను పిలిచి తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటారు.కాని పెద్ద హీరోలు ఎవరు తమ సినిమా ఆడియో ఫంక్షన్స్ అప్పుడు ఏ హీరోలను పిలవరు.ఇక్కడ మహేష్ బాబు మాత్రం వేరనే చెప్పాలి.ఎందుకంటే మహేష్ పవన్,ఎన్టీఆర్ సినిమాలకు తన వాయిస్ ఓవర్ ఇచ్చి సినిమాకు హెల్ప్ చేశాడు.
ఇప్పడు రాంచరణ్, ఎన్టీఆర్ వస్తున్నరనే వార్త అభిమానల ఆనందానికి హద్దే లేకుండ చేస్తుంది. ‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ వేడుక ఏప్రిల్7న జరగబోతోంది. ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రులుగా పనిచేసినవారంతా ఎల్బీ స్టేడియంలోనే ప్రమాణ స్వీకారాలు చేశారట. నిర్మాత దానయ్య ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్, రామ్చరణ్ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.కైరా ఆద్వానీ హీరోయిన్గా చేస్తుంది.దేవీశ్రీప్రసాద్ సంగీతం వహిస్తున్నారు.ఈ సినిమా ఏప్రిల్ 20న విడుదలకు సిద్ధంగా ఉంది.