యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న అరవింద సమేత సినిమా టీజర్ను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ మాస్ ఆడియన్స్కు బాగా నచ్చుతుంది.కత్తి పట్టుకోని ఎన్టీఆర్ నోట వచ్చిన మాటలు తూటాల్లా పేలాయి. ‘కంటపడ్డావా కనికరిస్తానేమో.. ఎంటపడ్డానా నరికేస్తా ఓబా’ అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. టీజర్ జగపతి బాబు వాయిస్తో మొదలవుతుంది. ‘మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా? మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎలా ఉంటాదో తెలుసా? మట్టి తుఫాను చెవిలో మోగితో ఎట్టుంటాదో తెలుసా?’ అనే డైలాగ్స్ హైలైట్గా నిలిచాయి.
ఎన్టీఆర్ కత్తి పట్టుకుని స్టైలిష్గా వస్తుంటే ఆయన ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా దసరాకు రావడం పక్కా అని టీజర్ చివర్లో చూపించారు.ఎన్టీఆర్ సరసన హీరోయిన్లుగా పూజా హెగ్డె,ఈషా రెబ్బాలు నటిస్తున్నారు.టీజర్ను చూస్తుంటే ఇది కమర్షియల్ మూవీగా తెలిసిపోతుంది.త్రివిక్రమ్ ఇప్పటి వరకు ఫుల్లెంగ్త్ కమర్షియల్ మూవీస్ తీయలేదు.ఒకసారి టీజర్ను గమనిస్తే త్రివిక్రమ్ ఫస్ట్ టైం ఫుల్ మాస్ సినిమా తీసినట్లుంది.