దేశ వ్యాప్తంగా బిగ్ బీ అమితాబచ్చన్ మొదలు పెట్టిన కౌన్ బనేగా కరోడ్ పతి తర్వాత వివిధ భాషల్లో వచ్చింది. ఇక తెలుగులో కింగ్ నాగార్జున హూస్ట్ గా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఈ ప్రోగ్రామ్ కి హూస్ట్ గా వ్యవహరించారు. అంత గొప్ప స్టార్లు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’తో బుల్లితెరపై ఎంటర్ టైన్ మెంట్ చేశారు. ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ షో కి హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
అయితే ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారంటూ ఈమధ్య ప్రచారం జరిగింది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ ప్రోమోలో చైర్లో హోస్ట్ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ కూర్చుని ఉన్నాడు. దాంతో ఇందులో వ్యాఖ్యాతగా ఆయనే ఉంటాడన్న విషయాన్ని జెమినీ టీవీ స్పష్టం చేసింది.
‘రండి గెలుద్దాం… ఎవరు మీలో కోటీశ్వరులు’ అంటున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ‘కల మీది కథ మీది. ఆట నాది, కోటి మీది’ అంటూ ఎన్టీఆర్ చెబుతోన్న ప్రత్యేక డైలాగులు అలరిస్తున్నాయి. ఇందులో ఆయన కొత్త గెటప్లో కనపడుతున్నాడు.