Sunday, May 5, 2024
- Advertisement -

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు నిరాశే?

- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వ‌రుస హిట్ల‌తో మంచి ఫాంలో ఉన్నాడు.తాజాగా ఆయ‌న న‌టిస్తున్న అర‌వింద స‌మేత సినిమా ద‌స‌రాకు విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే ,ఈషా రెబ్బాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త‌తో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర నిరాశ‌లో ఉన‌ట్లు తెలుస్తుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్‌ మాస్‌ డ్యాన్స్‌ మూమెంట్స్‌ చూసే అవకాశం అభిమానులకు లేదన్న ప్రచారం జరుగుతోంది.

రిలీజ్‌కు మరింత సమయం లేకపోవటంతో విదేశాల్లో చిత్రీకరించాలనుకున్న ఓ పాటను తొలిగించినట్టుగా తెలుస్తోంది. పైగా సినిమాలో నాలుగు పాట‌లు మాత్ర‌మే ఉన్న‌ట్లు తెలుస్తుంది.వాటిలో ఒకటి బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్, మరొకటి ఇటీవల రిలీజ్‌ అయిన రొమాటింక్ సాంగ్‌ కావటంతో వాటిలో ఎన్టీఆర్‌ డ్యాన్సులు చూసే అవకాశం లేదు.. ఈ వార్తలతో తారక్‌ డ్యాన్స్‌లు చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులు నిరాశే అన్న టాక్‌ వినిపిస్తోంది. సినిమాను ద‌స‌రాకు కానుక‌గా అక్టోబ‌ర్ 11న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -