Saturday, May 4, 2024
- Advertisement -

సెట్స్ పైకి వెళ్లకుండానే ఎన్టీఆర్ టీజర్ ?

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ ఆర్ ఆర్ ఆర్ తరువాత నేషనల్ వైడ్ గా విస్తరించిన సంగతి తెలిసిందే. దాంతో తారక్ తరువాతి మూవీ కోసం యావత్ దేశ వ్యాప్తంగా వెయిటింగ్ నడుస్తోంది. తారక్ తన తరువాతి సినిమాను కొరటాల శివతో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడో అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ కూడా సెట్స్ పైకి వెళ్లలేదు. కథలో ఎన్టీఆర్ చాలా మార్పులు కోరాడని, అందుకే కొరటాల కథను ఇంక చెక్కే పనిలోనే ఉన్నడని వార్తలు వచ్చాయి. ఒకానొక దశలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం. స్క్రిప్ట్ విషయంలో ఏర్పడ్డ అడ్డంకులన్నీ తోకగిపోయాయట ఇక త్వరలోనే మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాలని కొరటాల భావిస్తున్నట్లు తెలుస్తోంది..

అన్నీ అనుకున్నట్లు కుదిరితే వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బాగా వినిపిస్తోంది. ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళే ముందే ఓ టీజర్ రిలీజ్ చేసేందుకు చిత్రా యూనిట్ ప్లాన్ చేస్తోందట. ప్రస్తుతం హాలిడే ట్రిప్ లో ఉన్న తారక్ రాగానే టీజర్ కు సంబంధించిన షాట్స్ షూట్ చేస్తారని తెలుస్తోంది. దాంతో ఫ్యాన్స్ లో జోష్ నింపేందుకు టీజర్ ను ముందే రిలీజ్ చేసి ఆపై మూవీని సెట్స్ పైకి వెళ్లనుందట. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు గాని ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి. ఇక గతంలో ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో వచ్చిన ‘ జనతా గ్యారేజ్ ‘ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దాంతో ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుండడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఈసారి పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ కాంబినేషన్ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

ప్రభాస్ మారుతి సినిమా ఫ్లాపే ?

వాల్తేరు వీరయ్య.. డిస్సపాయింట్ లో ఫ్యాన్స్ !

అక్కినేని హీరోలకు స్టార్ డమ్ వస్తుందా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -