Wednesday, May 15, 2024
- Advertisement -

ఆ హీరోయిన్ వల్ల నారారోహిత్ సినిమాకు కొత్త గుర్తింపు!

- Advertisement -

నటన పరంగా ప్రతిభ ఉన్నా.. సరైన హిట్ లభించకపోవడంతో నారా రోహిత్ ఇండస్ట్రీలో ప్రామినెంట్ హీరోగా నిలదొక్కుకోలేకపోతున్నాడు.

ఒకదాని తర్వాత మరొకటిగా.. ప్రయత్నాలు చేసుకొంటూ పోతున్నా.. ఈ హీరోకు సరైన హిట్ లేకపోవడం అనేది మైనస్ అవుతోంది.

కొన్ని యావరేజ్ సినిమాలు ఈ హీరో నుంచి వస్తున్నా.. హిట్ మాత్రం బాకీ పట్టాడు. మరి ఇతడి కెరీర్ ఇలా ఉన్నా.. ఇప్పుడు ఇతడి సినిమా ఒకటి మళయాలంలోకి డబ్ అవుతోంది.

కొంతకాలం కింద వచ్చిన రోహిత్ సినిమా “ఒక్కడినే” మళయాలంలోకి డబ్ అవుతోంది. మరి తెలుగులో అంత పెద్ద హిట్ కాలేదు ఈ సినిమా. ‘కథ’ సినిమా దర్శకుడు రూపొందించిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినా ఇది డబ్ అవుతోంది. మరి ఎందుకలా అంటే.. దానికి కారణం నిత్యామీనన్.

ఈ హీరోయిన్ కు తన సొంత రాష్ట్రంలో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు ఈ సినిమా అక్కడకి డబ్ అయ్యి వెళుతోంది. హీరో ఇమేజ్ మీద కాకుండా.. హీరోయిన్ ఇమేజ్ మీద ఆధారపడి ఈ సినిమా డబ్ అవుతోంది. మరి ఈ విధంగా నారా రోహిత్ కు నిత్యామీనన్ ప్లస్ అవుతోందనమాట! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -