గతంలోనే సుబ్బిరామిరెడ్డి.. చిరంజీవి, పవన్ కల్యాణ్లను కలిపి ఈ మూవీ తీస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తాడని.. అప్పుడు ప్రకటనలు కూడా రిలీజ్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు తెగ సంతోష పడ్డారు. ఆ తర్వాత ఆ కాంబినేషన్ గురించి ఊసే లేదు.
అటు చిరు, ఇటు పవన్లు లైట్ తీసుకోవడంతో చిరు – పవన్ల సినిమా కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యింది. అసలు ఈ కాంబినేషన్ సెట్స్పైకి వెళ్లే అవకాశమే లేదని, కేవలం పబ్లిసిటీ కోసం చిరు, పవన్ల పేర్లు వాడుకొంటున్నాడని జనం కూడా అనుకున్నారు. దాంతో.. ఈ కాంబో సినిమా రావడం కష్టామే అని లైట్ తీసుకున్నారు. అయితే మళ్లీ ఇప్పుడు ఈ సినిమా వార్తల్లోకి తీసుకొచ్చాడు సుబ్బిరామిరెడ్డి. ”చిరు,పవన్ ల కోసం కథ రెడీ అయిపోతోంది.
{loadmodule mod_custom,Side Ad 1}
చిరంజీవి, పవన్ల సినిమాలు పూర్తయ్యాక సెట్స్పైకి వెళ్లే సినిమా మాదే..” అంటూ ఇప్పుడు మరోసారి ఆ సినిమాని వార్తల్లోకి ఎక్కించాడు. ఈ సినిమాకి త్రివిక్రం దర్శకత్వం వహిస్తారని తెలిపాడు. అయితే.. ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్న మూడు సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయో తెలియదు.. చిరు 151వ సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇవన్నీ పూర్తయ్యే సరికి 2019 ఎన్నికలు కూడా దగ్గర పడతాయి. అప్పుడు ఎవరి రాజకీయాల్లో వారు ఉంటారు. ఏది ఏమైన ఈ సినిమా స్టార్ట్ అవుతే.. మెగా అభిమానులకు అంతకు మించిన పండుగా మరోకటి ఉండదు.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}4z1yQBO8nh4{/youtube}
Related