Friday, May 10, 2024
- Advertisement -

కాశీ క్షేత్రంలో అజ్ఞాత‌వాసి

- Advertisement -
  • ప‌వ‌న్ సినిమా చిత్రీక‌ర‌ణ పుణ్య‌క్షేత్రాల్లో

ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న 25వ సినిమా అజ్ఞాత‌వాసిపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా త‌న‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా నిలుస్తుంద‌ని ప‌వ‌న్ భావిస్తున్నాడు. కాట‌మ‌రాయుడు ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో ఈ సినిమాపై క‌సిగా ఉన్నాడు. త‌న స్నేహితుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న ప్ర‌స్తుతం న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు అజ్ఞాత‌వాసి అని దాదాపుగా ఖ‌రారు అయ్యింది. రేపు సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం ఇంత‌కుముందే సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించింది. అయితే ఈ సినిమాల చిత్రీక‌ర‌ణ మాత్రం ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రాలో చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

న‌వంబ‌ర్ 25వ తేదీన చిత్ర‌బృందం కాశీ వెళ్తోంది. కాశీ, గయ, అలహాబాద్ ప్రాంతాల్లో షూటింగ్ చేయ‌నున్న‌ట్టు టాక్‌. ఈ సందర్భంగా కాశీ క్షేత్రంలోని విశ్వనాథ‌ ఆలయంలో శివుడి సన్నిధిలో అజ్ఞాతవాసి టైటిల్ ఉన్న బాక్స్‌ను ఓపెన్ చేసి, పేరు అధికారికంగా ప్రకటిస్తారని స‌మాచారం. ఈ విధంగా సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌నే డిఫ‌రెంట్‌గా చేస్తున్నారు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ న‌టిస్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -