అయ్యప్పనుమ్ కోషియుమ్ అనే మలయాళ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక పవర్స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుపాటి నటిస్తుండటంతో ఆ మూవీకి అంచనాలు ఆకాశాన్నంటాయి. అంతేకాక ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నాడు. ఇదో చారిత్రక చిత్రం దీనికి ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఆ తర్వాత హరీశ్ శంకర్ డైరెక్షన్లో మరో మూవీ చేస్తున్నాడు పవన్ కల్యాణ్. ఇలా వరస చిత్రాలతో దూసుకుపోతున్నాడు పవన్. ఇదిలా ఉంటే అయ్యప్పనుమ్ కోషియుమ్కు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read: పవన్ కు కథ వినిపించడంపై విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ..!
ఈ సినిమాకు ‘పరశురామ కృష్ణమూర్తి’ అనే టైటిల్ పెట్టాలని చిత్ర బృందం భావిస్తుందట. గతంలో ఈ సినిమాక ‘బిల్లా రంగా’ అనే పేరు పెట్టారని వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి ఈ కొత్త టైటిల్ తెరమీదకు వచ్చింది. ఇందుకు సంబంధించి త్వరలో అధికారిక సమాచారం బయటకు రానున్నది. ఈ సినిమా షూటింగ్ తిరిగి జూలై సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ కాబోతోంది.
Also Read: గురూజీ ఫోకస్ మొత్తం పవన్ సినిమా పైనే..!