Thursday, April 25, 2024
- Advertisement -

పవన్​ కల్యాణ్​, రానా దగ్గుపాటి సినిమా టైటిల్​ ఇదేనా?

- Advertisement -

అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ అనే మలయాళ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్​ చేస్తున్న విషయం తెలిసిందే. సాగర్​ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​, రానా దగ్గుపాటి నటిస్తుండటంతో ఆ మూవీకి అంచనాలు ఆకాశాన్నంటాయి. అంతేకాక ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్​ శ్రీనివాస్​ స్క్రీన్​ ప్లే, మాటలు అందిస్తున్నాడు. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పవన్​ కల్యాణ్​ హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నాడు. ఇదో చారిత్రక చిత్రం దీనికి ప్రముఖ దర్శకుడు క్రిష్​ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఆ తర్వాత హరీశ్​ శంకర్​ డైరెక్షన్​లో మరో మూవీ చేస్తున్నాడు పవన్​ కల్యాణ్​. ఇలా వరస చిత్రాలతో దూసుకుపోతున్నాడు పవన్. ఇదిలా ఉంటే అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌కు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read: పవన్ కు కథ వినిపించడంపై విజయేంద్ర ప్రసాద్​ క్లారిటీ..!

ఈ సినిమాకు ‘పరశురామ కృష్ణమూర్తి’ అనే టైటిల్ పెట్టాలని చిత్ర బృందం భావిస్తుందట. గతంలో ఈ సినిమాక ‘బిల్లా రంగా’ అనే పేరు పెట్టారని వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి ఈ కొత్త టైటిల్​ తెరమీదకు వచ్చింది. ఇందుకు సంబంధించి త్వరలో అధికారిక సమాచారం బయటకు రానున్నది. ఈ సినిమా షూటింగ్ తిరిగి జూలై సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ కాబోతోంది.

Also Read: గురూజీ ఫోకస్ మొత్తం పవన్ సినిమా పైనే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -