క్షణం అనే సినిమాతో ఒక్కసారిగా ఇమేజ్ ని డబల్ చేసుకున్నాడు హీరో అడవి శేష్. పవన్ కళ్యాణ్ పంజా సినిమాలో విలన్ గా అందరికీ తెలిసిన అడవి శేష్ ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ లో కూడా చేస్తున్నాడు.
బాహుబాలి లో కూడా రానా కొడుకుగా చేసిన మనోడు క్షణం తో తనలో చాలా టాలెంట్ లు ఉన్నాయి అని బయట పెట్టాడు. క్షణం లో అతని నటన కి క్రిటిక్స్ నుంచి కూడా ప్రసంసలు అందాయి. ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి తొందర పడలేదు శేష్. నెమ్మదిగా మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూసీ చూసీ ఇప్పుడు గూడచారి అనే సినిమాకి ఓకే చెప్పాడు.
ఈ సినిమాకి ఇద్దరు డైరెక్టర్స్ గా పని చేస్తున్నారు. రాహుల్ పాకాల-శశికిరణ్ తిక్కా అనే డైరెక్టర్ డ్యూ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. శేష్ తర్వాతి చిత్రాన్ని తనే ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Related