జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్గా త్వరలో జెమినీ టీవీలో ఎవరు మీ లో కోటిశ్వరుడు అనే ఓ టీవీ షో ప్రసారం కాబోతున్న విషయం తెలిసిందే. ఈ షోలో మొట్టమొదటి గెస్ట్గా రామ్ చరణ్ రాబోతున్నట్టు సమచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం బయటకు రాబోతున్నది. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం రామ్చరణ్, తారక్ కలిసి ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రూ. 450 కోట్ల భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కబోతున్నది. చారిత్రక కథాంశం నేపథ్యంలో ఈ సినిమాను తీస్తున్నారు రాజమౌళి.
చారిత్రక వీరుడు కుమ్రంభీంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియో సైతం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. రామ్చరణ్ సరసన ఆలియాభట్, తారక్ సరసన ఒలీవియా మోరీస్ నటిస్తున్నారు. ఇక అజయ్ దేవ్గణ్, సముద్రఖని, శ్రియ ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఎవరు మీలో కోటిశ్వరుడు? షో మొదటి ఎపిసోడ్లో తారక్, రామ్ చరణ్ కనిపిస్తే తమ సినిమాకు ఎంతో ప్రమోషన్ దక్కుతుందని ఆర్ఆర్ఆర్ మేకర్స్ భావిస్తున్నారట. ఇక ఆ కార్యక్రమానికి కూడా మంచి ప్రచారం దక్కుతుంది. దీంతో రెండు ప్రయోజనాలు దక్కేలా ఈ గేమ్ షోను ప్లాన్ చేశారట. ఇలా మొదటి షోలో తారక్ హోస్ట్గా కనిపించబోతుండగా.. గెస్ట్గా చెర్రీ కనిపిస్తారన్నమాట.
Also Read
శంకర్ – చెర్రీ మూవీలో జగపతి బాబు? క్యారెక్టర్ ఏమిటంటే?
అల్లు అర్హ బిగ్ స్క్రీన్ పై ఎంట్రీ కన్ఫర్మ్.. అల్లు అర్జున్ ఎమోషనల్ ..!