Saturday, April 27, 2024
- Advertisement -

ఎవరు మీలో కోటిశ్వరుడు? ఫస్ట్​ గెస్ట్​ గా ఎవ్వరంటే..?

- Advertisement -

జూనియర్​ ఎన్టీఆర్​ హోస్ట్​గా త్వరలో జెమినీ టీవీలో ఎవరు మీ లో కోటిశ్వరుడు అనే ఓ టీవీ షో ప్రసారం కాబోతున్న విషయం తెలిసిందే. ఈ షోలో మొట్టమొదటి గెస్ట్​గా రామ్​ చరణ్​ రాబోతున్నట్టు సమచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం బయటకు రాబోతున్నది. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన షూటింగ్​ జరుగుతోంది. ప్రస్తుతం రామ్​చరణ్​, తారక్​ కలిసి ఆర్​ఆర్​ఆర్​ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రూ. 450 కోట్ల భారీ బడ్జెట్​తో పాన్​ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కబోతున్నది. చారిత్రక కథాంశం నేపథ్యంలో ఈ సినిమాను తీస్తున్నారు రాజమౌళి.

చారిత్రక వీరుడు కుమ్రంభీంగా జూనియర్​ ఎన్టీఆర్​, అల్లూరి సీతారామరాజుగా రామ్​ చరణ్​ కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన మేకింగ్​ వీడియో సైతం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. రామ్​చరణ్​ సరసన ఆలియాభట్‌, తారక్​ సరసన ఒలీవియా మోరీస్‌ నటిస్తున్నారు. ఇక అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని, శ్రియ ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఎవరు మీలో కోటిశ్వరుడు? షో మొదటి ఎపిసోడ్​లో తారక్​, రామ్​ చరణ్​ కనిపిస్తే తమ సినిమాకు ఎంతో ప్రమోషన్​ దక్కుతుందని ఆర్​ఆర్​ఆర్​ మేకర్స్​ భావిస్తున్నారట. ఇక ఆ కార్యక్రమానికి కూడా మంచి ప్రచారం దక్కుతుంది. దీంతో రెండు ప్రయోజనాలు దక్కేలా ఈ గేమ్​ షోను ప్లాన్​ చేశారట. ఇలా మొదటి షోలో తారక్​ హోస్ట్​గా కనిపించబోతుండగా.. గెస్ట్​గా చెర్రీ కనిపిస్తారన్నమాట.

Also Read

శంకర్​ – చెర్రీ మూవీలో జగపతి బాబు? క్యారెక్టర్​ ఏమిటంటే?

అల్లు అర్హ బిగ్ స్క్రీన్ పై ఎంట్రీ కన్ఫర్మ్.. అల్లు అర్జున్ ఎమోషనల్ ..!

చైతూకు నో చెప్పిన బేబమ్మ..! రీజన్​ ఏమిటో?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -