Wednesday, May 22, 2024
- Advertisement -

ఆ అనుభ‌వాలు వింటే మ‌తి పోతుంది – పూజా హెగ్డె

- Advertisement -

హీరోయిన్ పూజా హెగ్డ్ టాలీవుడ్‌లో దూసుకుపోతుంది.స్టార్ హీరోల‌తో వ‌రుస పెట్టి సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉంటోంది.తాజాగా ఈ బ్యూటీ మీటూ ఉద్యమంపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ”ఈ ఉద్యమానికి నా మద్దతు ఎప్పుడో ప్రకటించాను. ఈ ఉద్యమం కేవలం ఏ ఒక్క అమ్మాయి కోసమో కాదు.. మహిళలందరికీ సంబంధించిన విషయం. ఇప్పటికే పలువురు మహిళలు ముందుకొచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని చెబుతున్నారు.

కానీ కొందరు మాత్రం దీని గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఎప్పుడో జరిగిపోయిన విషయాల గురించి ఇప్పుడు చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అన్యాయం ఎప్పుడు జరిగినా.. నష్టం పూడ్చలేనిది. ప్రతి రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులను అరికట్టడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలి.ముఖ్యంగా సినిమా రంగంలో ఈ రకమైన వేధింపులు దారుణంగా ఉంటున్నాయి. ఒక్కొక్కరి అనుభవాల గురించి వింటుంటే మతి పోతుంది. చాలా మంది మీకు ఇలాంటి వేధింపులు ఎదురుకాలేదా..? అని అడుగుతున్నారు. ఇప్పటివరకు అయితే నాకు ఎదురుకాలేదు.దీనిని స్వార్థం కోసం ఉప‌యోగించుకోవ‌ద్ద‌ని హిత‌వు ప‌లికింది పూజా హెగ్డె.ప్ర‌స్తుతం ఆమె మ‌హేశ్‌బాబు,ప్ర‌భాస్ సినిమాల‌లో హీరోయిన్‌గా న‌టిస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -