ముకుందా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది పూజా హెగ్డె.కెరీర్ తొలినాళ్లలో ఆమెకు అన్ని పరాజయాలే పలకరించాయి.బన్నీతో నటించిన దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో తొలి హిట్ అందుకుంది పూజా హెగ్డె.ఈ సినిమాలో పూజా బికిని అందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఇక్కడి నుంచి పూజా వెనుతిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది.తెలుగులో వరుస స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంది పూజా.తాజాగా ఆమె నటించిన అరవింద సమేత సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వూలో మాట్లాడుతు సినిమా సంబంధించిన విశేషలను చెప్పుకొచ్చింది.త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నాపై నమ్మకంతో నాకు ‘అరవింద’ పాత్రను ఇచ్చారు.
ఆయన సెట్లో చాలా ప్రశాంతంగా ఉండటం వలన షూటింగ్ సరదాగా సాగిపోయింది. ఆయనతో కలిసి మరోసారి పని చేయాలని వుంది. ఇక ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పిన తక్కువేనని అంటోంది పూజా.సినిమా పట్ల ఎన్టీఆర్కు ఉన్న అంకిత భావం మరెవ్వరకి ఉండదని చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ అంత పెద్ద స్టార్ అయి ఉండి కూడా సెట్లో ప్రతి ఒక్కరిని చాల అప్యాయంగా పలకిరిస్తారని ,ఎవరైనా వస్తే తను కూర్చున్న సీటును సైతం వారికి ఇచ్చి నిలబడతారని తెలిపింది.ఎన్టీఆర్ నిజ జీవితంలో ఇంత సింపుల్గా ఉంటారని నేను ఊహించలేదని చెప్పుకొచ్చింది పూజా.అరివింద సమేత గొప్ప విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నానని తెలిపింది పూజా హెగ్డె.