పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున ఒక ప్రోగ్రాం ప్రారంభించాడు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ కూడా మన నాయకులు ఇలాంటి పథకాలను ప్రారంభిస్తున్నారు. ఆ పథకాలకు బ్రహ్మాండమైన పేర్లు కూడా పెడుతున్నారు. అదే కోవలో ఇప్పుడు పవన్ కూడా మహిళ కోసం ‘వీర మహిళ’ అన్న పథకాన్ని ప్రారంభించాడు పవన్. ఈ ప్రోగ్రాం పేరులోనే ఆ ప్రోగ్రాం ఎందుకో తెలుస్తోందిగా. దశాబ్ధాలుగా నాయకులందరూ చెప్తున్న మహిళా అభ్యున్నతి, మహిళల సర్వా సత్తాక అభివృద్ధి లాంటి రొటీన్ డైలాగులే పవన్ కూడా వినిపించాడు.
అయితే పవన్ చెప్పిన మాటలకంటే కూడా జనాలను మాత్రం పూనం కౌర్ పెట్టిన ఒక ట్వీట్ ఎక్కువ ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ ‘వీర మహిళ’ కార్యక్రమాన్ని ల్యాప్ టాప్లో బటన్ ప్రెస్ చేసి ప్రారంభించిన కాసేపటికే పూనం కౌర్ ట్వీట్ చేయడం గమనార్హం. ‘ట్రైయింగ్ టు అండర్స్టాండ్ వాట్ విమెన్ ఎంపవర్మెంట్ రియల్లీ మీన్స్?’ అంటూ పూనం కౌర్ ట్వీట్ చేయడం గమనార్హం. విమెన్ ఎంపవర్మెంట్ కోసం అని చెప్తూ పవన్ కళ్యాన్ ‘వీర మహిళ’ను ప్రారంభించడం…….ఆ వెంటనే పూనం కౌర్ విమెన్ ఎంపవర్మెంట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నట్టుగా ట్వీట్ చేయడంతో పవన్ అభిమానులు షాక్ తిన్నారు.
అసలే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళతో పాటు హీరోయిన్స్తో పవన్ వ్యవహారాలు కూడా చాలా చాలా చర్చకు వచ్చాయి. మహేష్ కత్తితో మీడియా వాళ్ళ పుణ్యమాని పవన్ ఒక ఉమనైజర్ అన్న అభిప్రాయం జనాల్లోకి వెళ్ళిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో కాస్త కవరింగ్ కోసం తన తెలంగాణా యాత్ర మొదలు పెట్టే సందర్భంగా ఓ పదిమంది మహిళల సమక్షంలో తన భార్య చేత తిలకం దిద్దించుకుని ‘వీర మహిళ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్కి పూనం కౌర్ ట్వీట్ షాక్ ఇచ్చి ఉంటుందనడంలో సందేహంలేదు. రీసెంట్గానే పవన్ లవ్ అంటూ ట్వీట్ చేసిన పూనం…….ఇప్పుడు తాజా ట్వీట్తో పవన్తో వ్యవహారం తేల్చుకునే దిశగా సాగుతున్నట్టుగానే కనిపిస్తోంది. పవన్ సన్నిహితులు మాత్రం మళ్ళీ ఈ హీరోయిన్స్ వ్యవహారాలు ఎక్కడ రచ్చకు వస్తాయో…….పవన్ ఇమేజ్ ఇంకా ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అని భయపడుతుండడం గమనార్హం.
https://www.youtube.com/watch?v=ulGYc7iTSME