Saturday, May 18, 2024
- Advertisement -

ప్రభాస్ కోసం మిస్ ఇండియా ని దించుతున్నారు

- Advertisement -

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి పార్ట్ 2 షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. అయితే  బాహుబలి పార్ట్ 2 తర్వాత ప్రభాస్ తన తదుపరి సినిమాని రాధాకృష్ణ డైరెక్షన్ లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మంచి ప్రేమకథ చిత్రంగా తెరకెక్కుతుంది. కాబట్టి ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని భావించిన దర్శక నిర్మాతలు పెద్ద ఎత్తున హీరోయిన్ కోసం వెదికారట.

మొత్తానికి మిస్ ఇండియా 2015 ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఫెమినా మిస్ ఇండియా గా ”అదితి  ఆర్య ” ఎంపికయ్యింది కాగా ఆ భామని దర్శకులు పూరి జగన్నాద్ కళ్యాణ్ రామ్ సరసన ”ఇజం ” సినిమా కోసం ఎంపిక చేసారు దాంతో తప్పకుండా బాగుంటుందని భావిస్తున్నారట. అందులోను పూరి – ప్రభాస్ లు మంచి స్నేహితులు.

పూరి జగన్నాదే ప్రభాస్ కు ఈ భామ ని రికమెండ్ చేసి ఉంటాడని అంటున్నారు. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ కు ఎలాంటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అందుకే ప్రభాస్ కోసం మిస్ ఇండియా ని దించుతున్నారు.

Related

  1. మహేష్, ప్రభాస్ ల మీద కామెంట్స్ చేసిన చెర్రీ!
  2. ప్రభాస్ తర్వాతి సినిమా టైటిల్ ఇదే!
  3. ప్రభాస్ కు ఎందుకు అవార్డులు రావడం లేదంటే?
  4. ప్రభాస్ కంటే నేనే ఎక్కువ అంటున్న రానా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -