కొత్తబంగారు లోకం సినిమాతో వెండితెరకు పరిచయమైన నటి శ్వేత బసు ప్రసాద్. ఆ సినిమాలో ఆమె నటన, అందం, అందులో చెప్పిన కొన్ని డైలాగ్స్ తో యువతకు దగ్గరై మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఆ తర్వాత ఆమె పలు సినిమాల్లో నటించినప్పటికీ.. పెద్దగా హిట్ సాధించకపోవడంతో సినీ కెరియర్ పరంగా వెనుకబడింది. ఈ క్రమంలోనే ఆమె సెక్స్ రాకెట్లో ఇరుక్కోవడం.. ఆ తర్వాత డిప్రెషన్లోకి వెళ్లడం, ప్రేమ.. పెళ్లి ఇవన్నీ వెంటవెంటనే జరిగిపోయాయి.
అయితే, తన జీవితంలో ఇప్పటివరకు చోటుచేసుకున్న అటుపోట్లను గుర్తుచేసుకుని కుంగిపోకుండా మళ్లీ ఆమె వెండితెరపై రెండో ఇన్నింగ్స్ ను మొదలు పెట్టింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది. అయితే, తాజాగా ఆమె నటిస్తున్న సినిమాలో సెక్స్ వర్కర్ పాత్ర పోషిస్తున్నారనే వార్త ప్రస్తుతం సినీ వర్గాలతో పాటు సామాన్య ప్రజానీకంలోనూ హాట్ టాపిక్ గా మారింది.
ఇక శ్వేత బసు ప్రసాద్ తాజాగా నటిస్తున్న ఇండియా లాక్ డౌన్ అనే సినిమాను మధుర్ బండార్కర్ తెరకెక్కిస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో విధించిన లాక్డౌన్ వల్ల తలెత్తిన పరిస్థితులు మరీ ముఖ్యంగా సెక్స్ వర్కర్ ల జీవితాలను ఆవిష్కరించనున్నారని సమాచారం. ఇందులో శ్వేత బసుప్రసాద్ సెక్స్ వర్కర్ పాత్రలో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ముంబయిలోని పలు ప్రాంతాలకు వెళ్లి సెక్స్ వర్కర్ల బాధలు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పరిస్థితుల గురించి తెలుసుకున్నామని శ్వేత బసుప్రసాద్ తెలిపారు. కాగా, ఇందులో ఆమె రియల్ లైప్ దృశ్యాలు సైతం ఉండవచ్చు అనే చర్చ నడుస్తోంది.
ఆ హీరోతో ప్రేమలో పడిపోయిన కియారా?
టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబో మరోసారి!