నటుడు ప్రకాశ్ రాజ్ తన పుట్టిన రోజు సందర్భంగా చేసిన ఓ ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అప్పూ సేవల బాధ్యత ఇక తనదంటూ ఆయన ట్వీట్ చేశారు. కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ కొద్ది నెలల క్రితం గుండెపోటుతో కన్నుమూసి కోట్లాది మంది అభిమానులను సోక సముద్రంలో ముంచిన సంగతి తెలిసిందే. అప్పూ గతంలో చేసిన సేవలను తన ఫౌండేషన్ ద్వారా ముందుకు కొనసాగించబోతున్నట్లు ప్రకాశ్ రాజ్ తెలిపారు.
‘‘నాకు ప్రత్యేకమైన రోజున ఈ శుభవార్తను మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. పునీత్ రాజ్కుమార్ ప్రారంభించిన సేవలను ఇకపై నేను ముందుకు తీసుకెళ్లబోతున్నా. త్వరలోనే ఆ వివరాలను తెలియజేస్తాను’’ అని అప్పూ ఫొటోను షేర్ చేశారు. పునీత్ ఆధ్వర్యంలో 45 ఫ్రీ స్కూల్స్, 26 అనాధాశ్రమాలు, 19 గోశాలలు, 16 వృద్ధాశ్రమాలు నడిచేవి. అంతే కాదు 1800 విద్యార్థుల బాధ్యతలను అప్పూ తీసుకున్నారు.
అయితే ఇందులో 1800 మంది విద్యార్థుల చదువు బాధ్యతను ఈ ఏడాది నుంచి తాను స్వీకరించబోతున్నట్లు .. హీరో విశాల్ తెలిపారు. పునీత్ మరణానంతరం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో విశాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. తాజాగా ప్రకాశ్ రాజ్ సైతం అప్పూ సేవా కార్యక్రమాల్లో భాగమయ్యేందుకు సిద్ధం కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.