Wednesday, April 24, 2024
- Advertisement -

శ్రీరెడ్డి ఇష్యూ……. తేజపై సురేష్‌బాబు ఆగ్రహం…… సినిమా ఆపేశాడు..

- Advertisement -

ఎన్నో ఫ్లాపుల తర్వాత ‘నేనే రాజు……..నేనే మంత్రి’ సినిమాతో ఒక యావరేజ్ హిట్ సినిమా తీశాడు తేజ. ఆ వెంటనే వెంకటేష్‌తో సినిమా తీయమని తన బేనర్‌లోనే ఆఫర్ ఇచ్చాడు సురేష్ బాబు. అంతా బాగానే ఉంటే ఎన్టీఆర్ బయోపిక్‌తో పాటు వెంకటేష్ సినిమా తేజ కెరీర్‌కి హెల్ప్ అయ్యేది. అయితే శ్రీరెడ్డి-అభిరామ్ ఇష్యూలో శ్రీరెడ్డి సైలెంట్ అయ్యేలా తాను చేస్తానని తేజ సీన్‌లోకి ఎంటర్ అయ్యాడు.

శ్రీరెడ్డితో మాట్లాడాడు. కాంప్రమైజ్ చేశాడు. ఆ తర్వాత శ్రీరెడ్డికి తాను డైరెక్ట్ చేస్తున్న రెండు సినిమాల్లో ఛాన్స్ ఇస్తున్నానని దేశాన్ని ఉద్ధరిస్తున్నాను అనే రేంజ్‌లో చెప్పుకున్నాడు. ఇక ఇండస్ట్రీలో ఉన్న మిగతా వాళ్ళు కూడా తనలాగే పెద్ద మనసు చేసుకుని అవకాశాలివ్వాలని మరో భారీ డైలాగ్ కొట్టాడు. అయితే తెరవెనుక ఏం జరిగిందో కానీ మా అసోసియేషన్ ప్రెస్ మీట్ తర్వాత శ్రీరెడ్డి అడ్డం తిరిగింది. తేజను అడ్డుపెట్టుకుని తనను బకరాను చేస్తున్నారన్న అనుమానం శ్రీరెడ్డికి వచ్చింది. ఆ వెంటనే సముదాయించాలనుకున్న తేజ మాట వినకుండా అభిరామ్‌తో తాను ఉన్న సన్నిహిత ఫొటోలు బయటపెట్టేసింది.

ఆ దెబ్బతో తేజ-సురేష్‌బాబుల భండారం మొత్తం బయటపడింది. అప్పటికప్పుడు శ్రీరెడ్డికి రెండు సినిమాల్లో అవకాశం ఇస్తున్నానని తేజ దేశాన్ని ఉద్ధరిస్తున్నాను అని చెప్పడానికి కారణం సురేష్‌బాబు పురమాయింపే అని ముందు నుంచే అనుమానాలు ఉన్నాయి. శ్రీరెడ్డి దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు బయటపెట్టకుండా ఉంటే అనేది బడా ఫ్యామిలీ తరపున తేజ పెట్టిన కండిషన్. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌ని మేనేజ్ చేయడంలో తేజ పూర్తిగా ఫెయిల్ అయ్యాడని……..మేనేజ్ చేస్తానని చెప్పి పూర్తిగా పరువు పోయేలా చేశాడని సురేష్ బాబు ఇప్పుడు ఫీలవుతున్నాడు. అందుకే తేజపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సురేష్‌బాబు……వెంకటేష్‌తో తేజ చేస్తున్న సినిమాను కూడా ఆపేశాడు. మొత్తానికి ఎరక్కపోయి ఇరుక్కున్నాను అన్న చందంగా తేజ పరిస్థితి తయారైంది అనడంలో సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -