Saturday, April 20, 2024
- Advertisement -

బాలయ్య తో అంటున్న పూరి వర్గీయులు

- Advertisement -

నందమూరి బాలకృష్ణ మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పైసా వసూల్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించిన విషయం మనకి తెలిసిందే కానీ కొన్ని ఏరియాల్లో నష్టాలూ కూడా వచ్చాయి. ఈ విషయం అటు బాలయ్య బాబు, ఇటు పూరి, ఇద్దరూ ఒప్పుకున్నారు. అయితే బాలయ్య మాత్రం మళ్ళీ పూరి తో పని చేయడానికి సిద్ధం గా ఉన్నాడు అని తెలుస్తుంది. పూరి కూడా ఇటీవలే బాలయ్య ని కలిశాడట. ఇస్మార్ట్ శంకర్ విజయం తర్వాత ఏ సినిమా చేయాలా అని ఆలోచిస్తున్న పూరి కి బాలయ్య నుంచి పిలుపొచ్చిందట.

అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పని మీద నే పూరి జగన్ ఫారిన్ కూడా వెళ్ళాడట. స్క్రిప్ట్ పని పూర్తి చేసుకొని తిరిగి ఇండియా రావాలని పూరి ప్లాన్.

అయితే మీడియా లో ఉన్న సమాచారం మేరకు ఈ సినిమా యష్ తో చేస్తున్న జనగణమన అని తెలుస్తుంది కానీ పూరి కి అత్యంత సన్నిహిత వర్గీయులు మాత్రం ఈ సినిమా బాలకృష్ణ తో చేయబోయేది అని చెప్పుకుంటున్నారు. కాకపోతే ఈ విషయం లో ఎంత నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -