Friday, April 26, 2024
- Advertisement -

నోర్లు అదుపులో పెట్టుకోండి…

- Advertisement -

టాలీవుడ్ ని కుదిపేస్తున్న డ్రగ్ స్కాండల్ వ్యవహారంలో దర్శకుడు పూరీ జగన్నాధ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయ‌న‌ను ఎప్పుడైనా అరెస్ట్ చేయ‌వ‌చ్చ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. మత్తుమందుల కేసుకు సంబంధించి నోటీసులు అందుకున్న వారిలో పూరీకి సన్నిహితంగా ఉండేవారే ఎక్కువగా ఉండడం.. రకరకాల రూమర్లకు దారి తీస్తోంది. ఒక ట్వీట్ పెట్టినా.. తానెలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని తప్ప.. డ్రగ్స్ అన్న మాట కూడా వాడలేదు.
అయితే.. తన తండ్రి పూరీ జగన్నాధ్ పేరును మీడియా ఇలా విస్తృతంగా ప్రచారం చేస్తుండడంపై .. కూతురు పవిత్ర స్పందించింది.నాన్న‌ ఓ సెలబ్రిటీ కాబట్టి.. ఇలా ఇష్టం వచ్చినట్లు రూమర్లు రాయడం సరికాద‌ని హిత‌వు ప‌లికింది. ఒక కుటుంబం గల వ్యక్తిగా.. ఆయనపై వేలెత్తి చూపించే ముందు.. వారి ఫ్యామిలీ గురించి.. ఆయన రెప్యుటేషన్ గురించి ఆలోచించాలి. తను ఎప్పుడూ కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి కోసమే తపన పడుతుంటారు’ అని చెప్పింది పవిత్ర.
‘ఒక దర్శకుడిగా ఆయన మేథస్సే ఆయన పెట్టుబడి.. భవిష్యత్తు కూడా. అలవాట్లతో కెరీర్ పాడు చేసుకోరు’ అని చెప్పిన పవిత్ర.. ‘మా నాన్నకు డ్రగ్స్ కు ఎటువంటి సంబంధం లేదు’ అని గట్టిగానే చెప్పింది. అంతేకాదు.. తన తండ్రిపై విమర్శలు చేస్తున్నవాళ్లు.. నోరు దగ్గర పెట్టుకోవడం మంచిదని తన తండ్రికి డ్రగ్స్‌తో ఎలాంటి సంబంధం లేదంటూ ఘాటుగా తన అభిప్రాయాలను సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -