సౌత్ సెక్సీగాళ్ లక్ష్మీరాయ్… జూలి దెబ్బకు జ్వరం తెచ్చుకుంది. ఎంతో ఎక్స్ పెక్ట్ చేసిన ఈ సినిమా సౌండ్ లేకుండానే సైడై పోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. అందుకే ఇక నుంచి గ్లామరస్ పాత్రలు కాకుండా ..పర్ ఫార్మెన్స్ రోల్స్ చేయాలనుకుంటుంది. అందుకు తగ్గట్లుగా ఇప్పటినుంచే ట్రైల్స్ వేస్తుంది. నిజానికి రాయ్లక్ష్మీ ఎన్ని భాషల్లో నటించినా, పేరును తారుమారు చేసుకున్నా, రాశి మాత్రం మారకపోవడంతో తీవ్ర నిరాశకు గురయిందట. కోలీవుడ్ హీరోయిన్గా పరిచయం అయినా.. వచ్చిన అవకాశాన్ని వదలకుండా, గెస్ట్ అపియరెన్స్, ఐటమ్ సాంగ్స్, నటిగా ఎన్ని రకాల పాత్రలు చేయాలో అన్నీ చేసేసింది. అయినా ఏ తరహా పాత్ర రాయ్లక్ష్మీని స్టార్ నటిని చేయలేక పోయింది. అయినా అందుకు అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉంది.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ బ్యూటీ ఎన్నో ఆశలు పెట్టుకున్న హిందీ చిత్రం ‘జూలీ -2’ ఇటీవల విడుదలై దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఈమె నిజానికి బాలీవుడ్ రంగప్రవేశానికి చాలా కాలంగా ప్రయత్నించి ‘జూలీ -2’ చిత్ర అవకాశాన్ని దక్కించుకుంది. మరో విషయం ఏమిటంటే… ఇది ఈ అమ్మడి అర్ధ శత చిత్రం. దక్షిణాదిలో అంతగా ఆశాజనకంగా లేకపోవడంతో జూలీ-2తో బాలీవుడ్లో సెటిల్ అయిపోదామని ఆశించిన రాయ్లక్ష్మీకి ఆ చిత్రం ఘోర నిరాశనే మిగిల్చింది.
సుమారు రూ.30 కోట్ల బడ్జెట్తో నిర్మాణం జరిగిన ఈ చిత్రం ఇప్పటికి కేవలం కోటి రూపాయలు మాత్రమే వసూలు చేసిందని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో జూలీ-2ను ప్లాప్ చిత్రంగా పరిగణించేస్తున్నారు సినీ పండితులు. కాగా తన 50వ చిత్రం ఇలాంటి ఫలితాన్నివ్వడంతో నటి రాయ్లక్ష్మీ ‘అనుకున్నదొక్కటీ అయ్యింది ఒక్కటీ’అనుకుని తీవ్ర షాక్కు గురైందని తెలుస్తోంది. తాజాగా ఈ అమ్మడు తెలుగులో గుంటూరు టాకీస్ చిత్రాన్ని తెరకెక్కించిన రాజ్ కుమార్ తో ఓ సినిమాను చేయనుంది. ఇందుల్లో అమ్మడు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రను చేయబోతుంది. రాయ్ లక్ష్మికి యాక్టింగ్ అంతంత మాత్రమే.అలాంటిది… అన్ని విప్పిన టైమ్లో చూడని జనాలు పోలీస్ డ్రెస్ లతో కప్పేసుకుంటే ఎంత వరకు చూస్తారు. చూడాలి.