Wednesday, April 24, 2024
- Advertisement -

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగ లాంటి వార్త.. రాధే శ్యామ్ నుంచి సర్ప్రైజ్..!

- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే. రాధే శ్యామ్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు ఆ మూవీ డైరెక్టర్ రాధాకృష్ణ ఓ ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ సినిమా నుంచి మూడు రోజుల్లో భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలిపాడు. ఆ సప్రైజ్ ఏంటా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. రాధే శ్యామ్ లోని కొన్ని సన్నివేశాలను మళ్లీ రీషూట్ చేస్తున్నారని, విడుదల ఆలస్యం కావచ్చని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.

అయితే వాటన్నిటికీ చెక్ చెబుతూ రాధాకృష్ణ షూటింగ్ కంప్లీట్ అయినట్లు ప్రకటించారు.మరో మూడు రోజుల్లో ఈ సినిమా నుంచి మరో సప్రైజ్ ఉంటుందని రాధాకృష్ణ ప్రకటించడంతో.. ఆ సర్ప్రైజ్ ఏంటా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. దీంతో ఈ సినిమాకు సంబంధించి టీజర్ కానీ ఫస్ట్ సింగిల్ కానీ వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అదే నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది పండగ లాంటి వార్తే.

రాధే శ్యామ్ లో ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. రాధే శ్యామ్ ను కృష్ణంరాజు, టీ సిరీస్ భూషణ్ కుమార్ సమర్పణలో యువి క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్, ప్రశీద భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ప్రభాస్ సలార్, ఆది పురుష్, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నారు.

Also Read

మా ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయా?

నాని .. అస్సలు తగ్గట్లేదు.. ఏడాదిలోనే మూడు సినిమాలు..!

ఓటీటీపై ఎర్రన్న సంచలన కామెంట్లు.. సీఎంలకు చురకలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -