తెలుగు ఇండస్ట్రీకి సంక్రాంతి పెద్ద పండుగ.సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చిన ప్రేక్షకులు చూస్తారు అనే భావన సిని పెద్దలకు ఉంది.గత ఏడాది విడుదలైన చిరంజీవి ఖైదీ 150 ,బాలయ్య ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ,శర్వానంద్ ‘శతమానంభవతి’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఈమూడు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. చిన్న సినిమా అయిన శతమానంభవతి కూడా మంచి కలెక్షన్స్ను రాబట్టడంతో వచ్చే సంక్రాంతికి సినిమాలు వచ్చేందుకు క్యూ కడుతున్నాయి.
ఈ సంక్రాంతికి పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’బాలయ్య ‘జైసింహా’ చిత్రం కూడా సంక్రాంతికి వస్తుందని ప్రకటన వచ్చింది.రెండు పెద్ద చిత్రాలతో పాటు 2018 సంక్రాంతికి కూడా ఒక చిన్న చిత్రంగా రాజ్ తరుణ్ నటించిన ‘రాజుగాడు’ అనే చిత్రం విడుదల కాబోతుంది.సంక్రాంతికి సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన వివరాలను దర్శకుడు సంజనారెడ్డి తెలియజేయడం జరిగింది. రాజ్ తరుణ్, అమైరా దస్తూర్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పథాకంపై నిర్మాత రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు.సినిమాపై ఉన్న నమ్మకంతో ఈ చిత్రాన్ని సంక్రాంతికి పెద్ద పోటీ ఉన్నా కూడా విడుదల చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.