Friday, April 26, 2024
- Advertisement -

ఎయిర్​పోర్ట్​ ఇలా ఉంటే దేశం పరువు పోదా? డైరెక్టర్ రాజమౌళి ట్వీట్ ..!

- Advertisement -

ప్రముఖ దర్శకుడు రాజమౌళి సంచలన ఆరోపణలు చేశారు. ఎయిర్​పోర్టు సిబ్బంది నిర్లక్ష్యంపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. రాజమౌళి ఇటీవల ఢిల్లీ ఎయిర్​పోర్ట్​కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితి చూసి ఆయన వాపోయారు. ఢిల్లీ ఎయిర్​పోర్టులో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడ ఆర్టీపీసీఆర్​ పరీక్షల కోసం చాలా మంది వేచి చూస్తున్నారు. కనీసం వారికోసం కుర్చీలు కూడా ఏర్పాటు చేయలేదు. కొంతమంది గోడలకు ఆనుకొని నిలబడ్డారు. మరికొందరు నేలమీదే కూర్చున్నారు.

ఇక ఎయిర్​పోర్టు బయటకు వచ్చాక అక్కడ వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇలా ఉంటే దేశం పరువు ఏమవుతుంది? చాలా మంది విదేశీయులు మన దేశానికి వస్తారు. ఇటువంటి పరిస్థితి చూస్తే వాళ్లు ఏమనుకుంటారు’ అంటూ రాజమౌళి ప్రశ్నించారు.
నిజానికి రాజమౌళి ఎప్పుడూ సామాజిక అంశాల మీద ప్రశ్నించరు. కానీ తొలిసారిగా ఎయిర్​పోర్ట్​ పరిస్థితిపై ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. రాజమౌళి ట్వీట్​కు ఎయిర్​పోర్టు సిబ్బంది, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

ప్రస్తుతం రాజమౌళి జూనియర్​ ఎన్టీఆర్​, రామ్​చరణతో ఆర్​ఆర్​ఆర్​ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉంది. ఇక దీని తర్వాత, మహేష్ బాబుతో ఓ సినిమా ఉంది. మగధీర -2 తీయబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం బయటకు రాలేదు.

Also Read: మహమ్మారి మబ్బులనూ ఛేదించాయ్..! తొలి ఆరు నెలల్లో నాలుగు బ్లాక్ బస్టర్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -