కబాలీ చిత్రం ప్రస్తుతం సౌత్ ఇండియాను షేక్ చేస్తోంది. ఈ చిత్రం మొదలు అయినప్పటి నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఆ తర్వాత వచ్చిన టీజర్ తో మరింత పెరిగిపోయాయి. అయితే ఈ చిత్రం ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మరి ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయి అని అందరు ఎదురు చూస్తున్నారు. మలేసియా, చైనా, జపాన్ లాంటి దేశాల్లో కూడా కబాలి సినిమా కోసం రజినీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
అయితే తెలుగులో కబాలి ట్రైలర్ ను ఐదుకోట్ల మంది చూడటం విశేషం. ఇక ఇదిలా ఉంటే టికెట్ల కోసం అడ్వాన్స్ బుకింగ్ లూ… తమిళ హీరో శింబు అయితే ఏకంగా 250 టికెట్లను కొనేసాడట… ఈ రభస అంతా జరుగుతూంటే మిస్టర్ కూల్ రాజమౌళి మాత్రం కబాలి మొదటి రోజే చూడలేకపోయినజ్ఞ్దుకు భాదపడుతున్నాడు.
రజినీ ఫ్యాన్స్ లిస్టులో ఉండే ప్రముఖులలో టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఒకరు. అయితే తాను ఆ సినిమా తొలి రోజు తొలి ఆట చూడలేకపోయానంటూ వాపోయాడు. ఈ విషయాన్ని జక్కన్న తన ట్విట్టర్ ఖాతా ద్వారా తన అభిమానులకు తెలిపారు. బాహుబలి-2 షూటింగ్ బిజీబిజీగా ఉండడంతో తాను కబాలి చూడలేకపోయానని రాజమౌళి పేర్కొన్నారు.
Related