బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించారు.ఈ సినిమాలో అమిర్తో పాటు అమితాబ్,కత్రినా కైఫ్ .. ఫాతిమా సనా షేక్ ప్రధానమైన పాత్రలను పోషించారు. హిందీతో పాటు తెలుగులోను ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 8వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను సోషల్ మీడియా ద్వారా రాజమౌళి రిలీజ్ చేశారు.
ఈస్ట్ ఇండియా కంపెనీవారు వచ్చిందయితే వ్యాపారం కోసమే .. కానీ ఇప్పుడు అది అధికారం చెలాయిస్తోంది. కానీ బానిసత్వానికి తలొగ్గని వాళ్లు కొందరున్నారు” అనే వాయిస్ ఓవర్ తో ఈ ట్రైలర్ మొదలవుతోంది. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ, ఆంగ్లేయులకు .. థగ్గులకు సంబంధించిన పోరాట సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు.ఆమిర్ ఖాన్ అద్భుతమైన ట్రీట్ ను అందించారంటూ రాజమౌళి తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
Privileged to release the Telugu Trailer of #ThugsOfHindosthan.
What a treat it is to watch @SrBachchan ji & @aamir_khan ji together on screen. Wishing the team a huge success 🙂 @yrf @TOHTheFilm #KatrinaKaif @fattysanashaikh https://t.co/HlYK4aZbSZ— rajamouli ss (@ssrajamouli) September 27, 2018