కబాలి రిలీజ్ కాకముందు రజనీ హెల్త్ పై కొన్ని రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఐసియూలో ఉన్నారనీ హెల్త్ బాలేదని ఇలా ఏవేవో రూమర్స్ వినిపించాయి. అయితే ఈ రూమర్స్ గురించి పట్టించుకోని రజనీ రెండు రోజుల క్రితం చెన్నైకి తిరిగి వచ్చారు. వచ్చీ రాగానే తనపై వచ్చిన రూమర్స్ ను నేరుగా కోట్ చేయకుండా అభిమానులను, ఆడియన్స్ ను ఉద్దేశించి ఓ ఓపెన్ లెటర్ రాశారు.
అందులో రజనీ ఏం రాశారంటే వరుసగా రెండు సినిమాలు.. శంకర్ తో ‘2.0’కు.. పా.రంజిత్ తో ‘కబాలి’కి తీరిక లేకుండా పని చేయడంతో విశ్రాంతి అవసరమైంది. రెండు నెలల విరామం తీసుకుని నా కూతురు సౌందర్యతో కలిసి అమెరికాకు వెళ్లాను. అక్కడే నా ఆరోగ్యం చూసుకున్నాను. వైద్య చికిత్స తీసుకున్నాను.
అమెరికాలో ‘కబాలి’కి అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. స్వయంగా చూశాను. తర్వాత చెన్నైకి వచ్చి ‘కబాలి’ సాధించిన విజయాన్ని కళ్లారా చూశాను. చాలా సంతోషం కలిగింది. ఈ సినిమాను నిర్మించిన నా లాంగ్ టైం ఫ్రెండ్ థానుకి.. దర్శకుడు పా.రంజిత్ మిగతా యూనిట్ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ‘కబాలి’కి ఇంత పెద్ద విజయాన్ని కట్టబెట్టిన ప్రేక్షకులు.. నా అభిమానులు.. డిస్ట్రిబ్యూటర్లు.. థియేటర్ల యజమానులకు కూడా నా కృతజ్నతలు’’ అని రజనీ అన్నారు.
Related